బంగారం సామాన్యుడికి బహు దూరం అయ్యింది. ప్రస్తుతం ఈ బంగారాన్ని మనం కొనగలమా? అనే ఆలోచనలో ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా స్టాక్ మార్కెట్ దారుణంగా పడిపోవడంతో ప్రస్తుతం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఎన్నడూ లేనంతలా బంగారం ధరలు భారీగా పెరిగాయ్. మొన్నటి వరుకు భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరిగాయ్ అంటే నమ్మండి. 

 

ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పట్లో సాధారణ స్థితికి రావు అని అర్థం అవుతుంది. ఈ నేపథ్యంలోనే నేడు మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 290 రూపాయిల పెరుగుదలతో 43,220 రూపాయలకు చేరింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 270 రూపాయిల పెరుగుదలతో 39,620 రూపాయలకు చేరింది. 

 

అయితే బంగారం ధరలు భారీగా పెరగగా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 250 రూపాయిల తగ్గుదలతో 48,060 రూపాయిలకు చేరుకుంది. అంతర్జాతీయంగా బంగారం, వెండి కొనుగోలుదారుల నుండి డిమాండ్ భారీగా పెరగటంతోనే బంగారం, వెండిపై ఈ ప్రభావం చూపిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

 

కాగా మరో వైపు ఢిల్లీలో, విజయవాడలో, విశాఖపట్నంలో కూడా బంగారం ధరలు ఇలాగే కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో చూడాలి. ఏది ఏమైనా ఆ బంగారం ధరలు చూస్తే ఇప్పట్లో మనం కొనలేం అని అర్ధం అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: