నిన్నటికి నిన్న తగ్గిన బంగారం ధరలు ఈరోజు మళ్లి దారుణంగా పెరిగాయి.. వారం రోజులు పెరిగితే రెండు రోజులు బంగారం ధరలు తగ్గుతున్నాయి.. ఇలా ఎంత తగ్గినప్పటికీ తగ్గిన మరుసటి రోజు బంగారం ధర రెట్టింపు అవుతుంది తప్ప ఏమాత్రం తగ్గడం లేదు.. ఇంకా ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా బంగారం, వెండి ధరలు సామాన్యులకు అందనంత ఎత్తుకు ఎదిగిపోయాయి. 

 

కరోనా వైరస్ ప్రభావం స్టాక్ మార్కెట్ పై పడటం.. అవి దారుణంగా కుప్పకూలడం.. ఇంకా ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చెయ్యడం వల్లే బంగారం ధరలు పెరిగాయి.. ఇలా రోజు రోజుకు బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇప్పటికే గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఏకంగా 16 వేలు పెరిగింది. ఈ కరోనా వైరస్ వచ్చిన రెండు నెలలకే బంగారం ధరలు దారుణంగా పెరిగాయి. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే నేడు బంగారం, వెండి ధర ఇలా కొనసాగుతుంది.. ఈరోజు హైదరాబాద్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయ్. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 310 రూపాయిల పెరుగుదలతో 48,990 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 410 రూపాయిల పెరుగుదలతో 45,280 రూపాయలకు చేరింది. 

 

ఇంకా వెండి ధర కూడా భారీగానే పెరిగింది. దీంతో నేడు కేజీ వెండి ధర 100 రూపాయిల పెరుగుదలతో 48,350 రూపాయలకు చేరింది. ఇలా నేడు బంగారం, వెండి ధరలు కొనసాగుతున్నాయి. ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: