భారతీయులకు బంగారంపై ఎంత మోజు అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతీ ఒక్కరూ తమస్థాయికి తగినట్లుగా బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇతరాత్ర అవసరాలకు బంగారం ఉపయోగపడుతుందని భావిస్తుంటారు. అయితే ఇప్పుడు సామాన్యుడికి బంగారం కొనే అవకాశాలు లేకుండా పోయాయి. 

 

బంగారం ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా వైరస్ కారణంగా బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అసలు కేవలం అంటే కేవలం రెండు నెలల్లో ఏకంగా 8 వేలు పెరిగింది.. 36 వేలు ఉండే బంగారం ధర కాస్త ఇప్పుడు 45 వేలకు చేరింది. కరోనా కారణంగా స్టాక్ మార్కెట్ లు కుప్పకూలడంతో ఇన్వెస్టర్లు అంత కూడా బంగారంపైనే ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో బంగారం ధర ఆకాశాన్ని తాకుతుంది. 

 

ఇంకా అలాంటి ఈ బంగారం ధర నేడు హైదరాబాద్ మార్కెట్ లో ఇలా కొనసాగుతుంది. పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 470 రూపాయిల పెరుగుదలతో 44,940 రూపాయలకు చేరింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర 470 రూపాయిల పెరుగుదలతో 48,970 రూపాయలకు చేరింది. ఇంకా బంగారం బాటలోనే వెండి ధర కూడా నడిచింది. 

 

దీంతో నేడు కేజీ వెండి ధర 900 రూపాయిలు పెరుగుదలతో 48,300 రూపాయలకు చేరింది. ఇంకా ఢిల్లీ మార్కెట్ లోను బంగారం ధరలు ఇలానే కొనసాగుతున్నాయి. అంతర్జాతీయంగా బంగారం డిమాండ్ భారీగా పెరగడంతోనే బంగారం ధరలు భారీగా పెరిగాయని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి అలాంటి ఈ బంగారం ధరలు సామాన్యుడికి ఎప్పుడు అనుకూలంగా మారుతాయో చూడాలి.                                                  

మరింత సమాచారం తెలుసుకోండి: