బంగారం ధరలు సామాన్యులకు షాక్ లు మీద షాక్ లు ఇస్తున్నాయి. ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా ఆకాశాన్ని తాకినా బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. మొన్న రెండు రోజులు తగ్గగానే ఇలాగే తగ్గుతూ వస్తాయి అని అనుకుందాం అంటే బంగారం ధరలు అసలు ఏ మాత్రం తగ్గడం లేదు. 

 

ఇప్పుడు తులం బంగారం ధర ఏకంగా 50 వేలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం డిమాండ్ భారీగా ఉండడంతో మన దేశంలోను బంగారం డిమాండ్ పెరుగుతుంది అని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. అయితే ఈరోజు హైదరాబాద్ లో బంగారం ధరలు ఏలా ఉన్నాయ్ అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. 

 

నేడు హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 560 రూపాయిల పెరుగుదలతో 50,270 రూపాయలకు చేరింది. అలానే పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 510 రూపాయిల పెరుగుదలతో 46,080 రూపాయలకు చేరింది. ఇంకా వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. దీంతో నేడు కేజీ వెండి ధర 600 రూపాయిల పెరుగుదలతో 48,430 రూపాయలకు చేరింది. 

 

ఇక దేశ రాజధాని ఢిల్లీలోనూ పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 49 వేలు కొనసాగుతుడగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 45 వేలు కొనసాగుతున్నాయి. ఇక ఆర్ధిక రాజధాని ముంబై లో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతుంది. ఇలా ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఇలా కొనసాగుతున్నాయి. మరి ఈ బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయి అనేది చూడాలి.                                         

మరింత సమాచారం తెలుసుకోండి: