అవును.. వరుసగా రెండు రోజు బంగారం ధరలు భారీగా పతనమయ్యాయి. సాధారణంగా బంగారం ధరలు అసలు తగ్గవు అలాంటిది ఇప్పుడు వరుసగా తగ్గుతూ వస్తున్నాయ్. సంవత్సరం వ్యవధిలో బంగారం ధర ఏకంగా రూ.20 వేలు పెరిగింది. రోజు రోజుకు పెరుగుతూ వస్తున్న ఈ బంగారం ధరమ్ ఇప్పుడు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరపైకి వచ్చినప్పటికీ జువెలర్లు, రిటైర్ల నుంచి డిమాండ్ మందగించడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. మరి ఈరోజు బంగారం ధర ఎంత తగ్గింది? ప్రస్తుతం బంగారం ధర ఎంత ఉంది అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం.
ఇంకా నేడు ఆదివారం హైదరాబాద్ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.30 తగ్గుదలతో రూ.51,170కు క్షీణించింది. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.30 తగ్గుదలతో రూ.46,890కు క్షీణించింది. కానీ బంగారం ధర స్వల్పంగా పడిపోతే.. వెండి ధర మాత్రం కాస్త పెరిగింది.
కేజీ వెండి ధర 40 రూపాయిల పెరుగుదలతో రూ.51,990లకు చేరింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ లేకపోవడమే ఇందుకు కారణం అని వ్యాపార నిపుణులు అంటున్నారు. కాగా దేశ రాజధాని ఢిల్లీలోను నేడు బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50 వేలకు చేరగా, పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46 వేల వద్ద కొనసాగుతుంది. ఇక ఆర్ధిక రాజధాని ముంబైలో కూడా బంగారం, వెండి ధరలు ఇలానే కొనసాగుతున్నాయి.