తల్లికి ప్రసవం అనేది ఓ పునర్జన్మ. తాను కరిగిపోతూ తన శరీరం లోని ఒక్కొక్క అణువు ని కలుపుకుంటూ తల్లి బిడ్డకు జన్మని ఇస్తుంది. ఈ క్రమంలోనే తల్లి శిశువుకు జన్మనిచ్చిన తరువాత 21 రోజుల నుంచి 29 రోజుల పాటు చాలా బలహీనంగా ఉంటుంది. శిశువుకు పాలు పట్టాల్సి ఉంటుంది కాబట్టి తల్లి ఆహార విషయంలో చాలా జాగ్రత్తులు తీసుకోవాలి. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
- పాలు, గుడ్లు తీసుకోవడం వల్లన వీటిలో అధికంగా ప్రోటీన్ఉ పొందుతారు.
- మాంసకృతులు పుష్కలంగా లభించే ఆహారం తీసుకోవలెను.
- ఆకుకూరలు క్రమం తప్పకుండా తీసుకోవాలి. పండ్లు ఎక్కువగా తినాలి.
- వెల్లుల్లి, అల్లం క్రమం తప్పకుండా తీసుకోవాలి.
- మెంతి, దాల్చిన చెక్క, జీర తీసుకోవడం మంచిది.
- రసుకులు తీసుకోవడం వల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది.
బాలింతలు తీసుకోకూడనివి:
- పచ్చళ్లు, కారప్పొడులు అస్సలు తినకూడదు.
- క్యాబేజీ, కాలిఫ్లవర్, టమాటా, రాడిష్ తీసుకోకూడదు. తమాటా ఎక్కువ తినడం వల్ల కడుపు నొప్పి వస్తుంది.
- ఎటువంటి మానసిక ఒత్తిడిక గురికాకూడదు.
- వేరుశెనగను తీసుకోవడం నివారించాలి. సాధారణంగా నట్స్ శిశువును అలర్జీకి గురిచేస్తుంది.