వంటింట్లో వంట చేస్తున్నామంటే అందులోకి ఉప్పు,పసుపు,నూనెతో పాటు అన్ని రకాలైన పోపు గింజలు ఉండాల్సిందే. అప్పుడే వండిన వంటకు రుచి వస్తుంది. ఇక  ప్రతిరోజూ వంటల్లో వాడే చింతపండు, ఆవాలు, పల్లీలు, పసుపు ఇలా ఒక్కొక్కటి మన ఆరోగ్యం మీద ప్రభావం చూపుతాయి. అయితే కొన్ని ఆరోగ్యానికి మంచి చేస్తే మరికొన్నింటి వల్ల సమస్యలు వచ్చి పడుతున్నాయి. మరి వేటివల్ల ప్రయోజనం ఉందో వేటివల్ల అపాయం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.



1. చాలామందికి పులుపు తినడం అంటే ఇష్టం. మరికొందరికి పులుపు అంటే ఆమడ దూరంలో ఉంటారు. కూరల్లో పులుపు కోసం చింతపండుని వాడుతారు. ఇది కొంత మోతాదు వరకు అయితే సరే అంతకు మించితే తలవెంట్రుకలు నెరిసిపోతాయి.
2. అంతేకాదు చింతపండు అధికంగా తీసుకోవడం వల్ల వయసు అధికంగా కనిపిస్తుంది. శరీరం లావై బుద్ధి కూడా మందగిస్తుంది. కాబట్టి చింతపండు వాడకాన్ని కంట్రోల్ పెట్టుకోండి.
3. తినే ప్రతీదాన్ని పోవు వేయడం అలవాటు భారతీయులకు. దీంతో మరింత టేస్ట్ వస్తుంది. పోపులో వేసే ఆవాలు దురద. శరీర నీరసాన్ని తొలిగిస్తుంది.



4. రసం, పులిహోర, బిర్యానీ ఫ్రైడ్‌రైసుల్లో కొత్తిమీరను వాడుతారు. దీనివల్ల శరీరం క్రమపద్ధతిలో ఉండేందుకు తోత్పడుతుంది.
5. చిన్నపిల్లలు, పెద్దలు వట్టిబెల్లం తింటుంటారు. అలాగే పల్లీలను కూడా తింటుంటారు. ఈ రెండింటి కాంబినేషన్ రుచికరంగా ఉంటుంది. పల్లీలను విడిగా తినకుండా బెల్లంతో కలిపి తింటే శరీరానికి శక్తి వస్తుంది.
6. పసుపు.. వంటల్లో చెడువాసనను తొలిగించడానికి పసుపును వాడుతారు. అలా అని ఎక్కువగా వాడితే పసుపు వాసన అధికంగా వస్తుంది. కాబట్టి దీన్ని కూడా లిమిట్‌గా వాడాలి. పసుపు రక్తమును శుభ్రం చేసేందుకు, ఉత్సాహమును కలిగించేందుకు చక్కగా పనిచేస్తుంది.



7. రసంలో ఘాటుగా తగిలే పదార్థం మిరియాలు. ఇది పడందే రసం టేస్ట్ రాదు. దగ్గు, జులుబు తరిమికొట్టాలంటే మిరియాలు ఉపయోగపడుతాయి. ఇవి గుండెకు చాలా మంచిది. గుండె నొప్పి రాకుండా కాపాడుతాయి.
8. అల్లం.. శరీరంలోని జీర్ణాశయాన్ని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా తల్లి పాలను శుభ్రం చేసే శక్తి కలిగి ఉంటుంది.
9. నువ్వులు శరీరంలోని ఎముకలను శక్తిని ఇవ్వగల సామర్థ్యము కలిగి ఉంటాయి. తలవెంట్రుకలకు ఇవి చాలా మంచిది. షుగర్ వ్యాధికి మందులా పనిచేస్తుంది.
10. జీలకర్రకు శరీరం మొత్తాన్ని శుభ్రపరిచే గుణం కలిగి ఉంది...

మరింత సమాచారం తెలుసుకోండి: