బస్సుల్లో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా మందికి వాంతులు వస్తాయి. వికారంగా అనిపిస్తూ తలతిరుగుతుంది. ఇలాంటి సమస్యను దాదాపు ప్రయాణం చేసే ప్రతివారు ఎదుర్కొంటుంటారు. ఇకపోతే మనలో చాలామందికి దూర ప్రయాణాలంటే తెగ ఇష్టం ఉంటుంది. కానీ, బస్సులో చేసే ప్రయాణం పడకపోవడం వల్ల ఈ టూర్లను విరమించు కుంటుంటారు. బస్సు ఎక్కితే చాలు కడుపులో తిప్పినట్లుగా ఉండి వాంతులు అవుతాయి. దీని వల్ల చేస్తున్న ప్రయాణంలో సంతోషం కలుగక పోగా ఆ ప్రయాణం చికాకును తెప్పిస్తుంది.


ఇలాంటి సమస్య నుండి బయటపడేందుకు ఈ చిట్కాలు పాటిస్తే సరి. అవేంటంటే. చాలమందికి బస్సులు ఎక్కువగా ఘాట్ రోడ్డులో ప్రయాణం చేసేటప్పుడు  వాంతులు అవుతుంటాయి. నార్మల్‌గా కన్నా ఇప్పుడే ఎక్కువగా ఉంటుంది. ఇలా చాలామందికి వాహనాల ప్రయాణం సమయంలో వాంతులు అవుతుంటాయి.


ఇటువంటి ప్రయాణం చేసే సమయంలో చిన్న అల్లం ముక్కను బుగ్గలోపల పెట్టుకుంటే వాంతి వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఈ  అల్లంతో కాల్షియం, పాస్పరస్, మెగ్నీషియం, ఐరన్, కాపర్, జింక్ వంటి అవసరమైన ఎన్నో పోషకాలు శరీరానికి అందుతాయి.


ఇకపోతే వాంతు వస్తున్నాయని ముందుగా తెలిసినప్పుడు వక్కపొడిని చప్పరించినా ఆ వాంతుల నుంచి బయట పడవచ్చు. ఇంతే కాకుండా నిమ్మకాయను కొద్దికొద్దిగా నలుపుతూ ముక్కు దగ్గర పెట్టుకొని వాసన పీలిస్తే ఈ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.. వీటితో పాటుగా లవంగాలు, సోంపు వంటివి దవడలో పెట్టుకొని చప్పరించినా కూడా వాంతులు రాకుండా ఉంటాయి.


ఇన్ని జాగ్రత్తలు తీసుకోకుండా ఉండాలంటే బస్సు అలవాటు పడాలి. అలవాటు పడాలి అంటే ప్రయాణం చేసే వారు అలవాటు చేసుకోవాలి. దానికి ఉన్న మార్గం బస్సులో, గాని కారులో గాని ప్రయాణం చేసేటపుపడు ముందు సీట్లో కూర్చొని పరిసరాలను గమనిస్తూ ఉంటే ఈ సమస్యను కొంతవరకు అధిగమించవచ్చు...


మరింత సమాచారం తెలుసుకోండి: