కేంద్ర కుటుంబ ఆరోగ్య మంత్రిత్వ శాఖ దేశంలోని 19 రాష్ట్రాల్లో కండోమ్ ల వాడకం బాగా తగ్గిందని నివేదిక ఇచ్చింది. 2000 సంవత్సరం లో దేశం లో 38శాతం మంది కండోమ్ వాడి సురక్షిత శృంగారం చేయగా.ఇప్పుడు 2019 సంవత్సరాని కి వచ్చే సరికి ఆ సంఖ్య 24శాతానికి పడి పోయిందని కేంద్రం సర్వే తేల్చింది. జనాభాను నియంత్రించడానికి ప్రభుత్వం వీటిని ఆరోగ్య కేంద్రాలు బస్టాండ్లు ఇతర ప్రాంతాల్లో ఉచితంగా అందించినా వీటిని వాడడానికి మాత్రం పురుషులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంది.
 
ప్రధానం గా పురుషులు కండోమ్ వాడక పోవడానికి శృగారంలో సంతృప్తి భావ ప్రాప్తిని కండోమ్ లు దూరం చేస్తున్నాయని భావించడమే కారణం.  అందుకే తమకు థ్రిల్ ఇవ్వని కండోమ్ కంటే జంటలు గర్భ నిరోధక మాత్రలు, కాపర్ టీ ఇంజెక్షన్లు, ట్యూబెక్టమీ వేసేక్టమీ ఇలా ప్రత్యామ్మాయ పద్ధతులను అవలంభిస్తున్నారని సర్వేలో తేలింది. 


ఇది సమాజానికి డేంజర్ బెల్ లాంటిది. కండోమ్ వాడకుండా అరక్షిత శృంగారం చేస్తే ఆ భాగస్వామి కి ఎయిడ్స్ లేదా ఏదైనా సుఖ వ్యాధులు ఉంటే పురుషుడి కి సోకే ప్రమాదం ఉంటుంది. తద్వారా 10 నిమిషాల సుఖం కోసం చూసుకుంటే నిండు జీవితమే నాశనమైపోతుంది. అందరూ థ్రిల్ సుఖం కోసం కండోమ్ ను దూరం పెడుతున్నా. తద్వారా వచ్చే ఎయిడ్స్ లాంటి భయంకర జీవితాన్ని చిదిమేసే వ్యాధులు సోకుతాయని మాత్రం ఆలోచించకపోవడం గమనార్హం. కండోమ్ వాడక పోవడం వల్ల నిర్లక్ష్యమే వారి ప్రాణాలు తీస్తోంది. 


 ప్రభుత్వం దీని మీద వెంటనే దృష్టి పెట్టి ఎయిడ్స్ సుఖ వ్యాధులు లాంటివి దరి చేరకుండా కండోమ్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించాలి. భావ ప్రాప్తి సుఖం కోసం కండోమ్ వాడక పోతే ఎయిడ్స్ లాంటి ప్రమాదకర వ్యాధులు చుట్టు ముట్టి ప్రాణాలు తీస్తాయనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: