ద్రాక్ష పండ్లు ఆరోగ్యానికి ఎంత మంచివో ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. వీటిని ఎక్కువగా స్వీట్లు, తీపి వంటకాల తయారీలో అందరూ ఉపయోగిస్తారు. కొందరైతే వీటిని అలాగే డైరెక్ట్గా ఎంతో ఇష్టపడి తింటారు. చక్కని రుచిని అందించే ఆహారంగానే కాక కిస్మిస్ను తరచూ తినడం వల్ల మనకు అనేక రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. ద్రాక్ష పండ్లలో విటమిన్ సి తో పాటు అనేక పోషకాలు కూడా ఉంటాయి. అయితే ఈ ఎండు ద్రాక్షలను కొన్నింటిని తీసుకుని రాత్రిపూట నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే తింటే దాంతో మనకు ఎన్నో లాభాలు కలుగుతాయట.
ఎండు ద్రాక్షలో ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్స్ అధికంగా ఉంటాయి . అందువల్ల ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఇలా రాత్రిపూడ నీటిలో నానబెట్టి వాటిని ఉదయాన్నే తినడం వల్ల రక్తంలో ఉన్న చెడు కొలెస్టరాల్ తగ్గుతుంది. అధిక బరువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్లను తింటే అధిక బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. అలాగే సంతానం లేని స్త్రీలు కిస్మిస్ పండ్లు తింటే అండాశయములోని లోపాలు తొలగిపోయి సంతానం కలుగుతుంది. మహిళలు ప్రతిరోజూ కిస్మిస్ పండ్లు తినడం వల్ల మూత్రాశయంలో అమ్మోనియా పెరగకుండా రాళ్ళు చేరకుండా కాపాడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అలాగే ఎండుద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగానే ఉంటాయి. ఇవి శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడికల్స్ నుంచి శరీరానికి రక్షణగా నిలుస్తాయి. పలు రకాల క్యాన్సర్లకు వ్యతిరేకంగా పోరాడుతాయి. మరియు ఉదయాన్నే ఎండు ద్రాక్షలను తినడం వల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. ఉద్యోగులకు, పిల్లలకు కిస్ మిస్ పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి. శరీరంలో టాక్సిన్స్ ను నివారించడంలో ఎండు ద్రాక్ష గ్రేట్ గా సహాయపడుతుంది. కాలేయ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది.