మన ఆరోగ్యానికి వెల్లుల్లి అనేది చాలా మంచిది. వెల్లుల్లితో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి కూడా. అదే విధంగా తేనె కూడా.. శరీరానికి ఎంతో మేలు చేసే గుణాలు ఉన్నాయి. ఉదయాన్నే వీటిని తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. ఉదయాన్నే చాలా మంది టీ, కాఫీలు తీసుకుంటారు. అయితే, వాటికంటే ముందుగా ఈ తేనె, వెల్లుల్లి మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని చెబుతున్నారు నిపుణులు. 


వెల్లుల్లి, తేనె కాంబినేషన్ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. వెల్లుల్లి ఉదయాన్నే తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు దూరం అవుతాయి. అలాగే.. ఇందులో అధికంగా యాంటీ యాక్సిడెంట్స్, ఫ్రీ రాడికల్స్ ఉంటాయి కావున ఇవి చర్మానికి ఎంతగానో మేలు చేస్తాయి. దీని వల్ల చర్మం నిగనిగలాడుతుంది. ఎంతో యవ్వనంగా మెరుస్తుంది. దీనితో పాటు చర్మంపై ముడతలు తగ్గుతాయి. యవ్వనంగా కనిపిస్తారని చెబుతున్నారు. నిజానికీ తేనెని పైపూతగా చర్మానికి పూస్తారు. దీని వల్ల మేను మెరుస్తుంది.


దీనితో పాటు తేనె కూడా చాలా వరకూ జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల డయేరియా, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దూరం అవుతాయి. పెద్ద పేగులో ఏర్పడే ఇన్ఫెక్షన్స్‌ ఈ మిశ్రమం దూరం చేస్తుంది. దీంతో పాటు శరీరంలోని అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది.


అదే విధంగా తేనెని కూడా అనేక విధాలుగా వాడుతుంటారు. ఈ రెండింటలో శరీరానికి మేలు చేసే ఎన్నో రకాల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వీటిని ఉదయాన్నే పరగడుపున తీసుకుంటే మంచిది.. దీన్ని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా రెండు, మూడు వెల్లుల్లిని తీసుకుని బాగా నలపాలి. దీని వల్ల పోషకాలు రెట్టింపు అవుతాయి. కొన్ని నిమిషాల తర్వాత అందులో తేనె కలిపి పడరగడపున తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: