ప్రతిరోజు ఓ ఆపిల్ తింటే వైద్యునితో అవసరం ఉండదని చెబుతుంటారు. మనకు అందుబాటులో ఉన్న అనేక రకాల పండ్లన్నింటిలో కంటే ఎక్కువ పోషకాలు యాపిల్ లోనే ఉన్నాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. యాపిల్ పండు తొక్కులో ఉండే దాదాపు పన్నెండు రకాల రసాయనపదార్థాలు క్యాన్సర్ కణాలను సమర్థంగా అడ్డుకుంటాయని పరిశోధనలో కూడా తేలింది. ఆపిల్లో అధిక మొత్తంలో విటమిన్స్ అండ్ మినరల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో రక్తాన్ని మరింత పటిష్టం చేస్తాయి. శరీరానికి ఇది ఒక గొప్ప సహజ యాంటీఆక్సిడెంట్ గా పని చేస్తుంది.
అయితే యాపిల్ ఏ టైమ్లో తింటే ఎక్కువ బినెఫిట్స్ పొందొచ్చు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. యాపిల్ని పగటిపూట తినడం చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే.. యాపిల్లోని పెక్టిన్, పీచుపదార్థాలు అధికంగా ఉంటాయి. రాత్రి సమయాల్లో తింటే ఇవి త్వరగా జీర్ణం కావు.. దీంతో జీర్ణసమస్యలు వస్తాయి. అలా కాకుండా పగటిపూట తింటే మనం ఏవేవో పనులు చేస్తుంటాం కాబట్టి పండ్లు త్వరగా జీర్ణమవుతాయి. అందుకే యాపిల్స్ని పగటిపూట తినాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ప్రతి రోజు ఆపిల్ తినడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది. చర్మ సంబధింత వ్యాధులను తగ్గిస్తుంది. ఊబకాయం, తలనొప్పి, కీళ్లనొప్పులు, ఆస్తమా, అనీమియా, క్షయ, నాడీ సమస్యలు, నిద్రలేమి, జలుబు వంటి పలురకాల సమస్యలకు ఆపిల్ చక్కని ఔషధంగా పనిచేస్తుంది. అలాగే యాపిల్స్లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవ రసాయనాలు ఉన్నాయి. యాపిల్స్ను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. సో.. రోజు పగటి పూట కనీసం ఒక యాపిల్ ఖచ్చితంగా తినండి.