ప్రస్తుతం ఎంతో మందిని వేధిస్తున్న అతిపెద్ద సమస్య పొట్ట. ముఖం ఎంతో అందంగా ఉంటోంది కానీ పొట్ట ఉండటంతో గ్లామర్ మొత్తం దెబ్బ తింటోంది అనుకుని బెంగ పెట్టుకునే వాళ్ళు ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యిపోయారు. పొట్ట మాట అలా ఉంచితే ఈ బాధతో ఆలోచించి..చించి జుట్టు ఊడగొట్టుకుంటున్న వాళ్ళు లేకపోలేరు. కేవలం పొట్ట వలన శారీరక సౌందర్యం మాత్రమే కాదు, అనారోగ్య పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు ఈ పొట్టని తగ్గించుకోవడానికి ఏమి చేయాలి..ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి...

 

పొట్ట ఉన్న వారికి నడుం చుట్టూ కొవ్వు పేరుకుపోయి చాలా అంద విహీనంగా కనిపిస్తారు. నలుగురిలో షర్టు తీయాలన్నా సరే ఎంతో ఇబ్బంది పడుతారు. ఇలాంటి వారు కొన్ని సహజ సిద్దమైన చిట్కాల ద్వారా ఎంతో సులువుగా పొట్టని కరిగించుకోవచ్చు. ముందుగా పొట్టని కరిగించే పురాతన పద్దతులలో అద్భుతమైన ఒక పద్దతిని గూర్చి తెలుసుకుందాం..

 

త్రిఫల చూర్ణం : త్రిఫల చూర్ణం రోజు రాత్రి పడుకునే సమయంలో  తీసుకోవడం వలన కొవ్వు కరిగిపోతుంది. ఈ చూర్ణాన్ని గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ వేసుకుని త్రాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు మొత్తం కరిగిపోతుంది. అలాగే ఈ చూర్ణం శరీరానికి యాంటిబయోటిక్ లా పనిచేస్తుంది. అనారోగ్యాన్ని కలిగించే ఎలాంటి వైరస్ అయినా శరీరంలోకి రాకుండా నియంత్రిస్తుంది.

 

ఎక్కువగా ఫైబర్ ఉన్న కూరగాయలు, ఆకు కూరలు తీసుకోవాలి. కేవలం ఫైబర్ మాత్రమే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా నియంత్రించ గలదు. అలాగే ఉదయం టిఫిన్ సమయంలో ఫైబర్ ఉన్న పళ్ళు తీసుకోవడం ఎంతో ముఖ్యం మధ్యాహ్నం భోజన సమయంలో కడుపు నిండా భోజనం చేసిన తరువాత మరలా సాయంత్రం 6 గంటలకి పళ్ళు అధికంగా తీసుకోవాలి. ఇక భోజన విషయం పక్కన పెట్టి కేవలం పళ్ళు మాత్రమే కడుపు నిండా తీసుకుంటే శరీరంలో జీర్ణక్రియ పూర్తిగా జరిగి కొవ్వుని కరిగించడంలో ఉపయోగపడుతుంది. ఇలా ఈ ప్రక్రియని రోజు వారి చేస్తే అనతికాలంలోనే పొట్ట తగ్గడమే కాకుండా ఆరోగ్య వంతంగా కూడా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: