చైనాలో కరోనా కట్టడి అయినా...హంటా వైరస్ కొత్తగా హడలెత్తిస్తోంది. మెల్లగా రోజురోజుకు ఉధృతమవుతోంది. హంటా వైరస్ ద్వారా హంటావైరస్ ఎలుకల ద్వారా వ్యాప్తి చెందుతుంది. సీడీసీ వెల్లడించిన సమాచారం ప్రకారం హంటా వైరస్ ఒక్కో రకం ఒక్కో జాతి ఎలుకల ద్వారా వ్యాపిస్తుంది. వీటి మలం, మూత్రం, సలైవా అలాగే కొన్ని సార్లు ఎలుక కరవడం ద్వారా ఈ వ్యాధి సోకుతుందంట. 2008లో భారతదేశంలో తొలిసారిగా పాములు, ఎలుకలు పట్టుకుని జీవించే వారిలో ఈ వైరస్ ప్రభావాన్ని గుర్తించారు. 2016లో ముంబైలో 12 ఏళ్ల బాలుడు హంటా వైరస్ కారణంగా చనిపోయాడు. ఈ వైరస్ సోకిన తర్వాత ఒకటి నుంచి ఎనిమిది వారాల్లో లక్షణాలు బయటపడతాయని వైద్యులు చెబుతున్నారు.
జ్వరంతో మొదలై అలసట, కండరాల నొప్పులు, తలనొప్పి, కడుపు నొప్పి, వాంతులు, డయేరియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. చివరి దశలో ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, శ్వాస తీసుకోవడం తీవ్ర ఇబ్బంది ఏర్పడి మరణిస్తారని వైద్యులు చెబుతున్నారు. చైనాలో ఇప్పటి వరకు ఈ వైరస్ బారిన ఇప్పటికే ఒకరు చనిపోగా 32 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. అయితే కరోనా వైరస్ దాడి నుంచి తేరుకోనక ముందే ఇలా మరో వైరస్ వెలుగులోకి రావడంతో అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కానీ ఈ వైరస్ గురించి పూర్తి విషయాలు తెలుసుకుని సరైన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం ఉండదు.
ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే ముందుగా ఎలుకలను దరిచేరనివ్వవద్దంటూ సూచిస్తున్నారు. కరోనాతో ఉన్నంత భయం దీనికి ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ వైరస్ మరణాల రేటు కరోనా కంటే ఎక్కువగా ఉండనుందని సీడీసీ ప్రకటించింది. దీని ఫాటాలిటీ రేటు 38 శాతంగా సీడీసీ గుర్తించింది. ఈ వ్యాధికి ఇప్పటి వరకు కచ్చితమైన ట్రీట్మెంట్ లేదు. జలుబు లక్షణాలతో సామీప్యం ఉండటంతో హంటా వైరస్ సిండ్రోమ్ లక్షణాలను మొదటి దశలో గుర్తించడం కష్టంగా మారింది. ఇదిలా ఉండగా ఈ వ్యాధికి సరైన మందును కనుక్కునే పనిలో చైనా శాస్త్రవేత్తలు నిర్విరామంగా కృషి చేస్తున్నారట.