రోజుకు ఒక్క ఆపిల్ తింటే చాలు డాక్టర్ అవసరం ఉండదంటారు. అది ముమ్మాటికి నిజమే. ఎందుకంటే ఆ పండులో ఉండే పోషక విలువలు అలాంటివి మరి. ఇక ఈ విషయం మనందరికి తెలిసన విషయమే.. కానీ, ఆచరించడంతో మాత్రం వెనకే ఉంటాం అన్నది వాస్తం. వాస్తవానికి ఈ ప్రపంచంలో అత్యధికంగా పండించే పంట మరియు ఎక్కువగా తినగలిగే హెల్తీ అండ్ న్యూట్రీషియన్ ఫ్రూట్ ఆపిల్. ఆపిల్స్ లో యాంటీఆక్సిడెంట్స్, మరియు వ్యాధులను వ్యతిరేకించే గుణాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆపిల్ పండ్లను తినడం వల్ల పలు అనారోగ్య సమస్యలకు స్వస్తి చెప్పవచ్చు అంటారు.
ఇక ఆపిల్ పళ్ళ కన్నా, ఆపిల్ జ్యూస్ ఇంకా మంచిదని రకరకాల వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆపిల్ కంటే ఆపిల్ జ్యూస్ ఎందుకు బెస్టో ఇప్పుడు తెలుసుకుందాం. రోజు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల మతి మరుపు వ్యాధి రాకుండా ఉంటుంది. ఈ ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల కోలన్, చర్మ, బ్రెస్ట్ క్యాన్సర్ లకు వ్యతిరేకంగా పని చేస్తుంది. ఈ జ్యూస్ క్రమం తప్పకుండా తాగితే మెదడు చురుగ్గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఒక గ్లాస్ ఆపిల్ జ్యూస్ తాగితే గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనులు, సిరలలో కొవ్వు ఏర్పడటాన్ని నిషేధించి, గుండె పోటు రాకుండా చేస్తుంది.
మరియు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల జీర్ణ శక్తిని పెంచుతుంది. అలాగే ప్రతి ఒక గ్లాసు ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల.. విపరీతంగా పెరిగే బరువును కంట్రోల్ చేయడం, శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంపపొందించడం, కంటిచూపు మందగించకుండా కాపాడటం, గాల్ బ్లాడర్లో రాళ్లు లేకుండా చేయడం వంటి ఉపయోగాలున్నాయి. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఆపిల్ జ్యూస్లో ఉండే విటమిన్ సి న్యుమోనియా రాకుండా చూస్తుందని నిపుణులు చెబుతున్నారు. నిత్యం ఆపిల్ జ్యూస్ తాగడం వల్ల ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు అంటున్నరు ఆరోగ్య నిపుణులు.