ప్రపంచ ప్రజల జీవనాన్ని మార్చేసింది కరోనా వైరస్. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజ వణికించేసింది. ప్రపంచవ్యాప్తంగా కోటి 26 లక్షలమందికి కరోనా వైరస్ వ్యాపించింది. ఇందులో 60 లక్షలమంది కరోనా వైరస్ నుండి కోలుకోగా 6 లక్షల మందికిపైగా కరోనా వైరస్ కు బలయ్యారు.
ఇంకా అలంటి కరోనా వైరస్ మహమ్మారిని ఎదర్కోవాలంటే మన శరీరంలో రోగనిరోధక శక్తి ఉండాలి. అప్పుడే మనం కరోనాకు బలి అవ్వము. అందుకే రోగనిరోధక శక్తి బాగుండాలి అంటే మనం తీసుకునే ఆహారంలో ఎలాంటి లోపము ఉండకూడదు. అప్పుడే సమస్యలు ఉండవు. అయితే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారం ఏంటి? అని అనుకుంటున్నారా ఇక్కడ చదివి తెలుసుకోండి..
నల్లద్రాక్ష, వేరుసెనగలు, పిస్తా, మల్బరీస్, స్ట్రా బెర్రీలు ఇవి రెగ్యులర్గా తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
జామకాయ, బత్తాయి, కమలాపండు, నిమ్మకాయ, కాప్సికమ్లాంటి వాటిలో విటమిన్ సి ఉంటుంది. వీటిని బాగా తినాలి.
చిలగడ దుంప, బొప్పాయి, క్యారెట్ లాంటి ఆహాపదార్ధాల్లో కెరోటినాయిడ్స్ ఉంటాయి.
రోగనిరోధక శక్తి వెల్లుల్లి, అల్లం, పసుపు, మిరియాలు, ఆకుకూరలు ముఖ్యంగా మునగాకు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
చూశారుగా ఈ ఆహారపదార్ధాలు ఎక్కువగా తీసుకోని రోగనిరోధక శక్తిని పెంచుకోండి.. కరోనాని తరిమికొట్టండి.