తెలంగాణలో కరోనా పరీక్షలను వేగిరం చేసేందుకు ప్రభుత్వం నడుం బిగించింది. పరీక్షల నిర్ధారణకు ఆస్పత్రికి వెళ్లాల్సిన పనిలేకుండానే ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ కిట్, మరియు హోంఐసొలేషన్ కిట్లను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు కిట్టు వినియోగంపైనా వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కల్పించేందుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. కరోనా బాధితులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికై అన్ని చర్యలు తీసుకుంటుందని వెల్లడించింది. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ, మస్కులు ధరించి ఉండాలని, తప్పనిసరి అయితే తప్ప బయటకు రాకుండా ఉండాలని సూచించింది. ఇప్పటికే వీరికోసం ప్రభిత్వం ప్రత్యేకంగా కాల్ సెంటర్ను ప్రారంభించింది.
తాజాగా అవసరమైన మందులు, ఇతర సామగ్రితో ఉన్న కిట్లను ఉచితంగా అందజేయడం విశేషం. రాష్ట్రంలో దాదాపు 10 వేలకు పైగా బాధితులు హోం ఐసొలేషన్లో ఉండి చికిత్స పొందుతున్నారని వీరి ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వ వైద్యులు ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. టెలిమెడిసిన్ ద్వారా సూచనలుచేస్తున్నారు. అత్యవసరమైనవారి కోసం త్వరితగతిన అంబులెన్సులను ఇండ్లకు పంపించి కొవిడ్ దవాఖానల్ల్లో చేర్చే విధంగా వైద్య ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి ఐసొలేషన్ కిట్లు పంపిణీ చేయడంతో వారికి కరోనా లక్షణాలు కలిగి ఉన్నవారికి ఎంతో ప్రయోజనకరంగా మారుతోంది.
రాష్ట్రంలో 85శాతం కేసుల్లో ఎలాంటి లక్షణాలు లేనివారే ఉన్నారని వీరు హోంఐసొలేషన్లో తీసుకోవాల్సిన మందులు ఈ కిట్లో ఉంటాయిని, దీంతో పాటు హోంఐసొలేషన్ లో ఎలా ఉండాలో సూచించే బ్రోచర్, కాల్ సెంటర్ నంబర్లు, వైద్యులు, ఏఎన్ఎం, ఆశా వర్కర్ల మొబైల్ నంబర్లను పొందుపరచడం జరిగిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు.
ఐసొలేషన్ కిట్లో ఉండే వస్తువులు.
విటమిన్-సీ టాబ్లెట్స్ 34
జింక్ టాబ్లెట్స్ 17
బీ- కాంప్లెక్స్ 17
క్లాత్ మాస్కులు 6
శానిటైజర్ 1
హ్యాండ్ వాష్ 1
గ్లోవ్స్ 2
సోడియం హైపోక్లోరైట్ ద్రవం 1 బాటిల్