ఉప్పు ఎక్కువగా తింటే
అనారోగ్య సమస్యలు వస్తాయి..గుండెకి ఉప్పు మంచిది కాదు అని అందరూ భావిస్తారు. కానీ "యూనివర్సిటీ ఆఫ్ ఎక్సెటర్" లో జరిపిన
పరిశోధనల ప్రకారం..ఉప్పుని తక్కువగా తింటే
శరీరంలో షుగర్ లెవిల్స్ తగ్గుముఖం
తాత్కాలికమే.ఈ అద్యయనం ప్రకారం, తక్కువ ఉప్పు తినటం వలన గుండె పైన ఎలాంటి ప్రభావం
ఉండదని వెల్లడించారు.
ఈ పరిశోధనలో భాగంగా 6500 మంది పైన వివిధ రకాల పరిశోధనలు జరిపి వివరాలు సేకరించారు.. 6 నెలల పాటూ.. రోజు తీసుకునే ఆహారంలో 8 నుండి 9 మిల్లిగ్రాముల లేదా 4 మిల్లిగ్రాముల ఉప్పుని తగ్గించటం వలన రక్త పీడనం తగ్గింది అని తెలిపారు. మనం తీసుకునే ఉప్పులో ఎక్కువ తక్కువలు ఉంటే గుండెలో ఆరోగ్య సమస్యలు ఏమి రావు అని అంటున్నారు. అయితే గుండె పోటు ర్రకుండా ఉండటానికి కేవలం ఉప్పు తక్కువగా తీసుకుంటేనే గుండె జబ్బులు రావు అనుకోకూడదు అంటున్నారు వైద్యులు.
ఉప్పుని తగినంతగానే తీసుకోవాలి..చాలా మంది ఉప్పుని తక్కువగా తీసుకుంటారు.అలా చేయడం వలన లో బీపీ కూడా వచ్చే అవకాశం లేకపోలేదు..ఎక్కువగా తీసుకుంటే అనారోగ్య సమస్యలు ఎదురవుతూ ఉంటాయి..ఏది ఏమైనప్పటికి, ఉప్పుని తగినతగానే ఉపయోగించడం వలన గుండె సంబంధిత వ్యాధుల పైన ఎలాంటి ప్రభావం చూపదని ఈ అధ్యయనం తెలుపుతుంది.