వేసవిలో తరచూ మన శరీరం అధిక వేడికి గురవుతుంటుంది. ఈ సీజన్లో పలు ఆహార పదార్థాలను తినడం వల్ల కూడా శరీరం వేడెక్కుతుంది. దీంతో కొందరిలో చెమట పొక్కులు, చెమట కాయలు అధికంగా వస్తాయి. కొందరికి అధిక వేడి కారణంగా విరేచనాలు అవుతాయి. ఇలా శరీర తత్వాన్ని బట్టి శరీరంలో ఉండే అధిక వేడి బయటకు వెళ్తుంటుంది. ఈ క్రమంలోనే అధిక వేడి బారిన పడే వారు కింద చెప్పిన పలు సూచనలు పాటిస్తే దాంతో శరీరాన్ని చల్లగా మార్చుకోవచ్చు.
అధిక వేడి నుంచి తప్పించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఒక గ్లాస్ దానిమ్మ రసం తాగితే అధిక వేడి వెంటనే తగ్గుతుంది. అందులో అవసరం అనుకుంటే కొద్దిగా బాదం నూనె కలుపుకుని తాగవచ్చు. ఇలా చేయడం వల్ల ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
2. శరీరంలోని వేడిని తొలగించడంలో గసగసాలు బాగా పనిచేస్తాయి. వీటి పొడిని చాలా తక్కువ మోతాదులో తీసుకుని దాన్ని నీటిలో కలిపి తాగితే ఫలితం ఉంటుంది.
3. ఒక టేబుల్ స్పూన్ మెంతుల్ని అలాగే తినాలి. లేదంటే వాటిని పొడి చేసి నీటిలో కలుపుకుని కూడా తాగవచ్చు. ఇలా చేయడం వల్ల కూడా అధిక వేడి నుంచి ఉపశమనం లభిస్తుంది.
4. ఒక గ్లాస్ చల్లని పాలలో ఒక టీస్పూన్ తేనె కలుపుకుని తాగితే శరీరంలో ఉండే అధిక వేడి మొత్తం బయటకు పోతుంది. శరీరం చల్లగా మారుతుంది.
5. గంధం అరగదీసి దాన్ని నీటితో కలిపి పేస్ట్లా చేసి నుదుటిపై రాయాలి. దీంతో వేడి తగ్గుతుంది.
6. ఒక గ్లాస్ పాలలో కొద్దిగా వెన్న కలుపుకుని తాగితే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
7. నిమ్మరసం, లేదా అలోవెరా (కలబంద) జ్యూస్ను తాగినా అధిక వేడి.