జీవించాలంటే నీరు అత్యవసరం. నీరు లేకుండా జీవించటం అసాధ్యం. శరీరంలో తగినంత నీరు ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు. నీటిని వేడిగా లేదా చల్లగా తాగచ్చు. అయితే, గోరువెచ్చని నీరు శరీరానికి మంచిదని రక్తప్రసరణ మెరుగుపరుస్తుందని వైద్యులు చెపుతున్నారు. ప్రాచీన కాలం నుంచే గోరు వెచ్చని నీరు ఆరోగ్యానికి ఎంతో మేలు అన్న నానుడి ఉంది. గోరు వెచ్చని నీటి వల్ల మంచి ఆరోగ్యంతో పాటు, శారీరక రుగ్మతలు కూడా ఉండవు.
గోరువెచ్చని నీటి వల్ల ఉపయోగాలు ఇవి
- గోరువెచ్చని నీరు 100% శ్వాస సంబంధిత వ్యాధులను, తలనొప్పి, లోబీపీ, కీళ్లనొప్పులు, హార్ట్బీట్, ఆస్తమ, కొలెస్ట్రాల్ పెరుగుదలను నియంత్రిస్తుంది.
- బ్లాక్ అయిన నరాలు, పొడిదగ్గు, కడుపు, కంటి, గొంతు, చెవి సంబంధిత వ్యాధుల నివారణలో సాయం చేస్తుంది.
- ఉదయం లేవగానే గోరువెచ్చని నీరు తాగేవారిలో... జీర్ణ సంబంధ సమస్యలు తొలగిపోతాయి.
- మలబద్దకం, పైల్స్ లాంటి సమస్యలకు కూడా ఈ నీరు చెక్ పెడుతుంది.
- వేడినీరు తాగడం వల్ల 'కేంద్ర నాడీ వ్యవస్థ' పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల ఒత్తిడి, ఆందోళన దూరమవుతాయి. చర్మానికి, వెంట్రుకలకు కూడా చాలా మంచిది.
- శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి, త్వరగా బరువు తగ్గుతారు.
- ఉదయంపూట ఖాళీ పొట్టతో గోరువెచ్చని నీరు తాగితే శరీర వ్యవస్ధ చక్కబడి నిద్రలోని అలసట తగ్గుతుంది.
- మెషిన్లలో కాచే వేడి నీటి కంటే గిన్నెలో కాచిన వేడి నీరు తీసుకుంటే ఇంకా మంచిది.