జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా కీర్తి బావుటాను ఎగురవేస్తుంది. నిన్నటికి నిన్న జాతీయ పోషణ్ అవార్డును అందుకున్న కుషిలో  ఉన్న ఈ జిల్లాకు  మరో జాతీయ అవార్డు దక్కింది. దీంతో జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతి  మరింతగా విస్తరించిందనే చెప్పాలి. ఇటీవల జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ హనుమంతరావు, జిల్లా అధికారులు జాతీయ పోషన్ అభియాన్ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా పోషణ్ అభియాన్ కింద 2018-19 సంవత్సరానికి జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లాగా సంగారెడ్డి ఎంపికైన సంగతి తెలిసిందే. 
ప్రభుత్వాసుపత్రుల్లో నాణ్యతా పరమాణాలు పెంచినందుకుగాను సంగారెడ్డి, జహీరాబాద్ ప్రభుత్వాసుపత్రలకు జాతీయ ఆరోగ్య మిషన్ లక్ష్య అవార్డు దక్కింది.



గతేడాది సెప్టెంబర్ నుంచి జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ప్రారంభమైంది. పోషణ లోపం లేని సమాజ నిర్మాణం కోసం కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పోషణపై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు. 300 అంశాలపై సమీక్షా సమావేశాలు, నాణ్యతా ప్రమాణాలు పెంచినందుకుగాను జహీరాబాద్ ఆసుపత్రికి 97శాతం, సంగారెడ్డి ఆసుపత్రికి 93శాతం మార్కులు వచ్చాయి. 



దేశవ్యాప్తంగా ఆసుపత్రుల పనితీరుపై సంతృప్తి చెందిన జాతీయ ఆరోగ్య మిషన్ ఈ అవార్డును అందించనుంది. ఈ అవార్డు పొందిన ఆస్పత్రులకు మూడేళ్ల పాటు లేబర్ రూమ్ కు, ఆపరేషన్ థియేటర్ కు రూ.3లక్షల చొప్పున అందించనున్నారు. దీంతో క్షేత్ర స్థాయిలో ప్రజలన్ని చైతన్యం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, జిల్లా పంచాయతీ, జిల్లా గ్రామీణాభివృద్ధి, ఇమ్యూనైజేషన్ శాఖల సమన్వయంతో కలెక్టర్ చేసిన కృషి ఫలించిందని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: