ఆసుపత్రులంటేనే హడలెత్తిపోయే పరిస్థితులు ఉభయ తెలుగు రాష్ట్రలో నెలకొన్నారు. నిన్న కాక మొన్న నిలోఫర్ ఆసుపత్రిలో వైద్యం వికటించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తీవ్ర స్థాయిలో వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. వైద్యులు ధనార్జనే ధ్యేయంగా పనిచేయడవల్లే దవాఖానాల్లో ఘోరాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయివేటు  ఆసుపత్రిలో గురువారం  మరో దుర్ఘటన జరిగింది.డబ్బుకోసం ఆంధ్రా హాస్పిటల్.. మరొక దారుణానికి వడిగట్టింది. ఈసారి వారి నిర్లక్ష్యానికి ఒక పసిప్రానం అనంత వాయువుల్లో కలిసి పోయింది.


 గత నెల 9వ తేదీన ఆసియా అని పేరు గల మూడేళ్ల చిన్నారిని నిమ్ము కారణంగా విజయవాడ పాత ఆంధ్రా హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. నెల రోజులుగా అక్కడే ఐసీయు లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న పాప.. హఠాత్తుగా ఈ రోజు ప్రాణాలు విడిచినట్లు అక్కడి డాక్టర్లు సమాధానం చెప్పడం జరిగింది. నిజానికి ఆ పాప ఈ రోజు(అక్టోబర్ –3) మధ్యాహ్నం 3గంటలకే ప్రాణాలు కోల్పోగా.. ఆ విషయాన్ని రాత్రి 8.30 గంటల వరకూ పాప తల్లితండ్రులకు తెలియనివ్వలేదు, ఈ నేపథ్యంలో ఆంధ్రా హాస్పటల్ డాక్టర్లపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే పాప ట్రీట్మెంట్  కోసం 7లక్షల రూపాయలు పైగా  ఖర్చు పెట్టిన తల్లితండ్రులు.. తమ చిట్టితల్లి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తుందని ఆశపడ్డారు.




కానీ కూతురి చావు వార్తను డాక్టర్లు మెల్లగా, మెల్లగా చెప్పడంతో అయోమయంతో ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. ఆంధ్రా హాస్పటల్ వారి నిర్లక్ష్యంపై   పాప కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ యాజమాన్యం వారి నిర్లక్ష్యానికి.. ఖర్చు పెట్టిన డబ్బుతో పాటు కూతుర్ని కూడా కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా పాప మరణానికి హాస్పిటల్ మ్యానేజ్మెంట్   నిర్లక్ష్యమే కారణమని వారు వాపోతున్నారు. తమ కూతురి చావుకి తగిన న్యాయం చేయాలని ఆసియా కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: