నిద్రసరిగా పోకుండా నిర్లక్ష్యం చేసేవారికి డయాబెటిస్ త్వరగా సోకే ప్రమాదముంది. మూడు రోజులు వరుసగా తగినన్ని గంటలు నిద్రలేకపోతే శరీరంలో వచ్చే మార్పులలో ముఖ్యమైన రక్తంలో గ్లూకోజ్ నియంత్రణగా గుర్తించారు. నియంత్రణ వ్యవస్థలో లోపం ఏర్పడటంలో షుగర్ జబ్బు వస్తుంది. బలవంతంగా నిద్రను అదిమి పెట్టి రాత్రళ్లు ఎక్కువసేపు మెలకువతో వుండేవారు, ముఖ్యంగా చదువుకునే పిల్లలు గుర్తించుకోవాల్సిన విషయం. అయితే వయసులో ఉండగా దీని ప్రభావం వెనువెంటనే కనిపించక పోవచ్చు. కానీ భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే ప్రమాదముంది. ఇక డయాబెటిస్ లక్షణాలు ఇప్పటికే కనిపించినవారు నిద్ర విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. దీని వలన హఠాత్తుగా రక్తంలో చక్కెరలు తారాస్థాయికి చేరి రోగిని కోమాలోకి తీసుకెళ్లే ప్రమాదముంది. కాబట్టి ఢయాబెటిస్ రోగులు తగినంత వ్యాయామం, నిద్ర అంతే !  

మరింత సమాచారం తెలుసుకోండి: