ప్రాచీన కాలం నుండి భారతీయులు వంటకాలలో పసుపుకు చాలా ప్రాధాన్యతను ఇచ్చారు. కానీ ఈ తరంలో తెలియని తనం వల్ల పసుపు యెక్క ప్రాధాన్యతను కొందరు విస్మరిస్తున్నారు. పసుపు కేవలం వంటకానికి రంగును తెచ్చేది మాత్రమే కాదు. పసుపు నీరుకలిపి మెత్తగా పేస్టులాగా చేసి క్రమంగా లోనికి తీసుకుంటే శరీరానకి చురుకుదనం పెరుగుతుందని ఆయుర్వేదం వెల్లడిస్తుంది. పసుపును వాడిన ఆహారము చర్మరోగాలను మూత్ర సంబంధ వ్యాధులను, సూక్ష్మక్రిములను హరిస్తుంది. కొన్ని సార్లు మనం తీసుకునే ఆహారంలో విషపధార్ధాలు లేక మలిన పధార్థాలు కలిప ఉండి మనలోకి వెళుతాయి. పసుపు కావలసినంతగా కలిపిన ఆహారం విష మరియు మలిన పధార్థాలను పసుపు తొలిగిస్తుంది. గ్యాస్ట్రబుల్ మరియు కడుపులో మంట. లాంటి సమస్యలను పసుపు ఓ చక్కని రోగనివారిణిగా గుర్తించబడుతుంది. సౌందర్యాన్ని మెరుగు పరిచే పరిశ్రమలు కూడా పసుకు ఎంతో ఋణపడిఉన్నాయి. పసుపును మెత్తగా పేస్టుగా కలిపి చర్మానికి రుద్దుకున్నట్లుయితే చర్మం నునుపుగా మారి తేజోవంతమౌతుంది. అలా పసుపు బాహ్య మరియు అంతర ప్రయోజనాలకు ఎంతగానో ఉపయోగపడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: