జూన్ 21వ తేదీన ఒక్కసారి చరిత్ర పుటల్లోకి తొంగి చూస్తే ఎన్నో ముఖ్య సంఘటనలు ఎంతో మంది ప్రముఖుల  జననాలు  ఇంకెంతో మంది ప్రముఖుల మరణాలు జరిగాయి. మరి ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్లి నేడు జన్మించిన ప్రముఖులు సంభవించిన మరణాలు జరిగిన సంఘటనలు ఏంటో తెలుసుకుందాం రండి. 

 


 పీవీ నరసింహారావు : భారత దేశ ప్రధానమంత్రిగా పీవీ నరసింహారావు 1991 జూన్ 21వ తేదీన నియమితులయ్యారు. భారత ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దక్షిణాత్యుడు  పీవీ నరసింహారావు మాత్రమే . ఒకే ఒక్క తెలుగువాడిగా కూడా పి.వి.నరసింహారావు ప్రసిద్ధులయ్యారు. భారత ఆర్ధిక వ్యవస్థ లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసింది పివి నరసింహారావే. 

 

 కాలేశ్వరం : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని  గోదావరిపై నిర్మిస్తున్న భారీ ఎత్తిపోతల ప్రాజెక్టు కాలేశ్వరం ను  2019 జూన్ 21వ తేదీన ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. 45 లక్షల ఎకరాలకు నీరు అందించడమే లక్ష్యంగా కాళేశ్వరం అనే బృహత్తర ప్రాజెక్టు నిర్మితమైంది. 

 

 బెనజీర్ భుట్టో జననం : పాకిస్థాన్ దేశపు 11వ ప్రధాని అయిన బెనజీర్ భుట్టో 1953 జూన్ 21వ తేదీన జన్మించారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకురాలు బెనజీర్ భుట్టో. ఒక ముస్లిం సంఖ్యాధిక్య దేశానికి  నాయకత్వం వహించిన తొలి మహిళా మూర్తిగా బెనజీర్ భుట్టో రికార్డు సృష్టించారు. అంతేకాకుండా పాకిస్థాన్ లాంటి ముస్లిం సంఖ్యాదిక్య దేశానికి రెండుసార్లు ప్రధానమంత్రి అయిన ఏకైక మహిళగా రికార్డు సృష్టించారు. బెనజీర్ భుట్టో. 1970లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పనిచేసిన జుల్ఫీకర్  అలీ భుట్టో కుమార్తె బెనజీర్ భుట్టో. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో చదువుకుని ... ఆక్స్ఫర్డ్ యూనియన్ కు నాయకత్వం వహించిన తొలి ఆసియా మహిళగా కూడా నిలిచారు. బెనజీర్ భుట్టో తండ్రి ప్రభుత్వాన్ని కూలదోసిన 1977 నాటి సైనిక తిరుగుబాటు తర్వాత కుటుంబ సభ్యులతో సహా పలుమార్లు గృహనిర్బంధంలో జీవించాల్సి వచ్చింది.

 


 ఎడ్వర్డ్ స్నోడెన్ జననం : అమెరికా కంప్యూటర్ నిపుణుడు అయిన ఎడ్వర్డ్ స్నోడెన్ 1983 జూన్ 21వ తేదీన జన్మించారు. అతను మొదట్లో అమెరికా ప్రభుత్వ నిఘా సంస్థ అయిన సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లో... సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ గా పనిచేశారు. అంతేకాకుండా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ లో కూడా కౌంటర్ ఇంటెలిజెన్స్ శిక్షకుడిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత డెల్ సంస్థ తరఫున ప్రైవేట్ కాంట్రాక్టర్ గా జపాన్లో ఉన్న నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ సంస్థలో చేరాడు ఎడ్వర్డ్ స్నోడెన్. మార్చ్ 2013లో హువాయి  లోని బుజ్ అలేన్ హామిలిటన్  అనే కన్సల్టింగ్ సంస్థ లో పని చేసారు. జూన్ 2013లో అతను ముందు పని చేసిన నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ నుండి సేకరించిన అనేక రహస్య పత్రాలను కూడా పలు మీడియా సంస్థలు వెల్లడించడంతో... అంతర్జాతీయంగా వార్తల్లో నిలిచాడు ఎడ్వార్డ్ స్నోడెన్.  అయితే అమెరికా చరిత్రలోనే మునుపెన్నడూ కూడా ఇంత భారీ మొత్తంలో రహస్యాలు వెల్లడి కాలేదు.

 

 కొత్తపల్లి జయశంకర్ మరణం : తెలంగాణ సిద్ధాంతకర్త గా పేరొందిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 1934 ఆగస్టు  6వ తేదీన జన్మించారు. తెలుగు ఉర్దూ హిందీ ఇంగ్లీషు భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారి గా నిలిచారు. ఆర్థికశాస్త్రంలో పీహెచ్డి పట్టా పొందిన కొత్తపల్లి జయశంకర్ ప్రిన్సిపాల్ రిజిస్టర్ గా పనిచేసి కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ వంటి ఉన్నత పదవులు పొందారు. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పాటులో  కల్వకుంట్ల చంద్రశేఖర రావు సలహాదారుగా మార్గదర్శిగా నిలిచారు కొత్తపల్లి జయశంకర్. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పలు పుస్తకాలను కూడా రచించారు. తెలంగాణ సాధనలో ఎంతో కీలక పాత్ర పోషించారు జయశంకర్. ప్రస్తుతం ఈయన స్మారకంగా ఒక జిల్లాకు జయశంకర్ భూపాలపల్లి అనే పేరును కూడా పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. ఈయన 2011 జూన్ 21వ తేదీన మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: