ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదం లో ఆరుగురు సజీవ దగ్ధం, 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఆగ్నేహ ఢిల్లీలోని జాకిర్ నగర్‌లోని ఓ నాలుగు అంతస్థుల నివాస భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకుని ఆరుగురు అగ్నికి ఆహుతి కాగా... మరో 11 మంది తీవ్ర గాయాల పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు.

జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీకి సమీపంలో మంగళవారం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన సంభవించింది. అందరూ నిద్రపోతున్న సమయంలో ఎలక్ట్రిసిటీ బాక్స్ నుంచి మంటలు రాగా...నిమిషాల వ్యవధిలోనే భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. 

సంఘటనాస్థలానికి ఎనిమిది ఫైర్ ఇంజిన్లతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని కొన్ని గంటల పాటు పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు.కొందరు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు పై అంతస్థుల నుంచి కిందకు దూకేశారు. తీవ్రంగా గాయపడిన వీరిని ఆస్పత్రులకు తరలించారు. అగ్ని కీలల్లో ఏడు కార్లు, 8 మోటార్ బైకులు కూడా కాలిబూడిదయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: