ఆంధ్రప్రదేశ్ లో సరికొత్త ఆవిష్కరణలు అందుబాటులో కి రాబోతున్నాయి. రాష్ట్రంలో ని అనంతపురం జిల్లా పెనుగొండ కేంద్రంగా నెలకొల్పిన ప్రతిష్టాత్మకమైన కీయా  ప్లాంటులో తయారయ్యే తొలి కారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా మార్కెట్ లోకి విడుదల కాబోతుంది. ఈనెల 8న కియా ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొనబోతున్నారు.


ఈ సందర్భంగా ఆయన కియా  కొత్త కారు అయిన ‘సెల్తోస్‌’ విడుదల చేయనున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రిని కియా కంపెనీ ప్రతినిధులు  ఆహ్వానించారు.  తన కొత్తకారు ‘‘సెల్తోస్‌’’ను మార్కెట్లోకి విడుదల చేయాల్సిందిగా కోరారు.  ముఖ్యమంత్రి నివాసంలో కంపెనీ ఎండీ కూక్‌ హ్యున్‌ షిమ్, చీఫ్‌ అడ్మినిస్ట్రేవ్‌ ఆఫీసర్‌ థామస్‌ కిమ్‌ ముఖ్యమంత్రిని కలిసి కొత్తకారు ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.


ఏడాదికి 3 లక్షల కార్లను అనంతపురం జిల్లా పెనుగొండ ప్లాంటుద్వారా ఉత్పత్తిచేయగలమని కంపెనీ ప్రతినిధులు చెప్పారు. భవిష్యత్తులో 7 లక్షల కార్లను తయారుచేసే సామర్థ్యానికి చేరుకుంటామని సీఎంకు వెల్లడించారు. ప్రస్తుతం టర్కీ, స్లొవేకియాలకు ఇంజిన్లనుకూడా ఎగుమతి చేస్తామన్నారు. కియా కొత్తకారు ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ హాజరవుతున్నట్టు కియా ప్రతినిధి బృందం పేర్కొంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: