కరోనా వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. అయితే లాక్ డౌన్‌లో వున్న ప్రజలంతా  ముఖ్యంగా వల్ల  ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని వైద్యులు చెప్తున్నారు. ముఖ్యంగా రోగనిరోధక శక్తిని  పెంచే ఆహారపదార్దాలు తీసుకోవాలని సూచించారు.ముఖ్యంగా పిల్లలకు పోషకాహారం ఇవ్వాలని న్యూట్రీషియన్లు చెప్తున్నారు. అలాంటి పోషకాహారం జాబితాలో నట్స్‌ను చేర్చవచ్చు.

 

నట్స్‌లో పిస్తా పప్పులు పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. పిల్లలలో జ్ఞాపకశక్తిని పెంచుతాయి. ఇందులో ప్రోటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. తరచుగా పిస్థాలను  తీసుకోవడం వల్ల గుండె, మెదడు ఆరోగ్యానికి ఇవి ఎంతగానో తోడ్పడతాయి. ఇందులో ఉండే పిండి పదార్ధాలు ఒబిసిటీని దూరం చేస్తాయి.సాధారణంగా నట్స్‌ను అధికంగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ శాతం పెరుగుతుంది..కానీ పిస్తాలో ఆ సమస్య లేదు. ఎక్కువగా తిన్నా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. పిస్తా పప్పులను షుగర్ వ్యాధిగ్రస్తులు తీసుకుంటూ ఆరోగ్యానికి మంచి చేస్తుంది.

 

పిస్తాలు శరీరంలోని ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచి గ్లూకోజ్ స్తాయిలను తగ్గిస్తాయని వైద్యులు చెప్తున్నారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు కూడా పిస్తా పప్పులు తీసుకోవచ్చు.మంచి పోషకాలు ఉంటాయి పిస్తా పప్పులలో. శరీరానికి అధిక కొవ్వు కూడా పట్టదు. 

 

పిస్తాలోని విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను చక్కగా పని చేసేలా చేస్తాయి. ఇవి శరీరంలో సక్రమంగా సరైన రక్త సరఫరాకు ఇవి సహాయపడతాయి. పిస్తాలో  ఎక్కువగా విటమిన్ 'ఇ' ఉండడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు.విటమిన్ ఇ వల్ల వృద్ధాప్య ఛాయలు అనేవి రావు. ఎప్పటికి యవ్వనంగా ఉంటారు. అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది. ముఖ్యంగా ఇంట్లో చిన్నపిల్లలకి క్రమంతప్పకుండా పిస్తా పప్పులు ఇవ్వండి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: