మొదటి అయిదేళ్లు పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైనవి. అప్పుడు శారీరక ఎదుగుదల బాగుంటుంది. జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. పిల్లలు పొడుగవుతారు. బరువు కూడా పెరుగుతారు. ఇలాంటి సమయంలో తల్లిదండ్రులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. అవేమిటో తెలుసుకుందాం...

 


ఈ వయసు పిల్లల్లో ఏకాగ్రత తక్కువ. ప్రతిపదినిమిషాలకూ వారి దృష్టి వేరే వాటిమీదికి మళ్లిపోతుంటుంది. అందుకే తల్లిదండ్రులు పిల్లలకు 20 నిమిషాల లోపు అన్నం తినిపించాలి.ఆకలేసినప్పుడే పిల్లలకు అన్నం పెట్టాలి. ఆకలి కాకుండానే అన్నం పెడితే వారు సరిగా తినరు.


 

తిండి విషయంలో పిల్లల్ని వారి స్నేహితులతో పోల్చవద్దు. పిల్లలకు ఏది ఇష్టమో తెలుసుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ల స్నేహితులు ఎలాంటి ఫుడ్‌ ఐటమ్స్‌ తెచ్చుకుంటారో అడిగి తెలుసుకుంటే మరీ మంచిది. అలా చేస్తే ఫుడ్‌కి సంబంధించి పిల్లల ఇష్టాయిష్టాలు ఏమిటో తల్లిదండ్రులకు తెలిసే అవకాశం ఉంటుంది.అన్నం తింటే నీకు చాక్లెట్‌ పెడతాను. బిస్కెట్‌ ఇస్తాను అని అమ్మలు పిల్లల్ని ఆశపెడుతుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. 

 

 


మెనూ ప్లానింగ్‌లో పిల్లల పాలుపంచుకునేలా చేయాలి. ఎలాంటి ఫుడ్‌ ఐటమ్స్‌ వారికి ఇష్టం, ఎలాంటివి ఇష్టం లేదు తెలుసుకుని దానికి అనుగుణంగా మెనూ టైమ్‌టేబుల్‌ తయారుచేసి పిల్లలకు పెట్టాలి. పోషకాహార లోపం ఉన్న పిల్లలు దేన్నీ తినడానికి తొందరగా ఇష్టపడరు. అలాంటి వారికి తగిన సప్లిమెంట్లు ఇప్పించాలి. అప్పుడు వారిలో పోషకాహార లోపం సమస్య పోయి ఆకలి వేయడం, తిండి పట్ల ఆసక్తి పెరగడం రెండూ పెరుగుతాయి.సాధారణంగా ఈ వయసులో పిల్లలు కొంత  సమయం ఇంట్లోనూ, కొంతసమయం స్కూల్ లోనూ,గడుపుతారు. అందుకనే తల్లులు పిల్లలు ఆహారం తినే వేళల పట్ల శ్రద్ద వహించాలి. టైంకు అనుగుణంగా వాళ్లకు ఆహారం పెట్టాలి. అప్పుడే వాళ్లకు ఎనర్జిటిక్ గా ఉంటారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: