"భారతీయత" అంటే ముందుగా గుర్తొచ్చేది మహిళలు. తరవాత వారి కట్టూ-బొట్టూ, ఆచారం-సాంప్రదాయం. కట్టుకున్నోడు కసాయివాడైనా, కర్కోటకుడైనా సరే, పసుపు తాడు కట్టినోడిని ప్రాణం కంటే ఎక్కువగా భావిస్తారు భారతీయ మహిళలు. అయితే నగరీకరణ, ప్రాశ్చత్యపోకడలు, హైటెక్-హంగులు, కారణాలేమైనా భారతీయ మహిళల అలవాట్లు, ఆలోచనల్లో కూడా పలు రకాల వైవిధ్య భరితమైన మార్పులు వస్తున్నాయి.
భారతదేశ ఐటీ రాజధానిగా పేరుపొందిన బెంగళూరు ఇప్పుడు విద్రోహ-నమ్మక ద్రోహ రాజధానిగా మారిందని ఫ్రెంచ్కి చెందిన సోషల్ నెట్ వర్కింగ్ సర్వీస్ గ్లీడన్ తెలిపింది. అందుకు తాజాగా ‘గ్లీడెన్ - ఆండ్రాయిడ్ యాప్ నిర్వహించిన సర్వేలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ‘గ్లీడెన్’ యాప్ ప్రత్యేకంగా వివాహేతర సంబంధాలు కోరుకునేవారి కోసం రూపొందించిన అడల్డ్ యాప్. ఇందులో మహిళలు, తమకు నచ్చిన అబ్బాయి తో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుకోవచ్చు, వీడియో ఛాట్ కూడా చేయవచ్చు. ఈ యాప్ తాజాగా నిర్వహించిన ఒక సర్వేలో తాజాగా భారతీయ మగువలు కట్టుబాట్లను లెక్కచేయకుండా వివాహేతర సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారని తేలింది.
ఇందుకు ప్రధాన కారణం వివాహం కారణంగా మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు కష్టాలు కట్టుబాట్లు మాత్రమేనట. ‘మహిళలు ఎందుకు వివాహేతర సంబంధం పెట్టుకుంటారు? పేరుతో సర్వే నిర్వహించింది ‘గ్లీడెన్’. ఈ యాప్ ను భారతదేశంలో దాదాపు 5 లక్షల మంది వినియోగిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది బెంగళూరు, ముంబై, కోల్కత్తా, ఢిల్లీ వంటి మెట్రో సిటీల్లో నివసిస్తున్నవారే. చెన్నై, హైదరాబాద్ నగరాలు ఇందులో లేకపోవటం గమనార్హం.
వివాహేతర సంబంధాలను కోరుకునేవారి సంఖ్య బెంగళూరులో రోజురోజుకి పెరిగిపోతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని గ్లీడన్ తెలిపింది.గ్లీడన్ నిర్వహించిన స్టడీ ప్రకారం భారత్ లో మొట్టమొదటి సారిగా మహిళలు స్టార్ట్ చేసిన వివాహేతర డేటింగ్ సైట్ లో 135000 మంది బెంగుళూరు వాసులు వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు. ఇందులో 43200మంది మహిళలు ఉన్నారు. దేశంలోనే అత్యధికంగా వివాహేతర సంబధాలు కోరుకుంటున్నవారు ఉంటున్న నగరంగా బెంగళూరు రికార్డ్ సృష్టించినట్లు గ్లీడన్ కన్ఫర్మ్ చేసింది.
బెంగళూరు సిటీ లోని వివాహితులైన 43200 మంది మహిళలు ఎగ్జైట్మెంట్, ఫ్రీడమ్ కోసం చూస్తున్నారని గ్లీడన్ చేసిన అధ్యయనంలో తేలింది. బెంగళూరుని భారతదేశపు ద్రోహపు రాజధానిగా పిలవడంలో ఎలాంటి తప్పులేదని గ్లీడన్ మార్కెటింగ్ స్పెషలిస్ట్ 'సొలినీ పైలట్' తెలిపారు. గ్లీడన్ సబ్-స్రైబర్స్ మొత్తంలో 27 శాతం మంది యాక్టివ్ యూజర్లు బెంగళూరియన్లే ఉన్నారు.వీరిలో పురుష-మహిళల నిష్పత్తి 32:68 గా ఉంది.
వివాహేతర సంబంధం పెట్టుకుంటున్న మహిళల్లో ఎక్కువమంది సంసార జీవితంవల్ల సంతోషంగా లేకపోవడం, భర్త తనను నిర్లక్ష్యం చేయడం, ఇంటి పనుల్లో భర్త పాలు పంచుకోకపోవడం వంటి కారణాల వల్ల అటువైపు చూస్తున్నామని ఒప్పుకున్నారు. ‘గ్లీడెన్’ యాప్ వాడుతున్న ప్రతి పదిమంది మహిళల్లో నలుగురు, తెలియని వ్యక్తులతో సెక్స్-ఛాట్ చేస్తూ, సంసార జీవితంలో కోల్పోయిన మజాను అస్వాదించాలని కోరుకుంటున్నారు.
జవజీవాలు లేని సంసారంలో ఈ శృంగార సంభాషణ కొత్త చిగురులు పూయిస్తుందని భావిస్తున్నారు. ఈ యాప్ వాడుతున్న మొత్తం వినియోగదారుల్లో 20 శాతం పురుషులు, 13 శాతం మహిళలు తమ భాగస్వామిని మోసం చేసి, మరో వ్యక్తితో ఆ సంబంధం పెట్టుకున్నామని ఒప్పుకున్నారు. ఈ యాప్ వినియోగిస్తున్న వారిలో ఎక్కువ మంది 34 నుంచి 49 ఏళ్ల మధ్య వయస్కులే ఎక్కువగా ఉండడం విశేషం.
2009 లో ఫ్రాన్స్ లో ప్రారంభమైన ‘గ్లీడెన్’ యాప్, 2017 లో భారతదేశంలోకి ప్రవేసించింది. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని కోరుకునే మహిళలు, ఆన్లైన్ సైట్స్, డేటింగ్ యాప్స్ ద్వారా ప్రియుడి కోసం వెతుకుతున్నారట. ఐదు లక్షల మంది వినియోగదారులతో నిర్వహించిన ఈ సర్వేలో ఇండియాలో స్వలింగ సంపర్కులు విపరీతంగా పెరిగిపోతున్నట్టు తేల్చింది.
కుటుంబంతో బంధాలు బలపడటానికి వివాహేతర సంబంధం తనకు బాగా ఉపయోగపడిందని బెంగళూరుకి చెందిన 31 ఏళ్ల మహిళా యూజర్ తెలిపింది.వివాహేతర సంబంధానికి ముందు తనకు మోటివేషన్ కొరవడిందని ఆమె తెలిపింది. కుటుంబంతో పాటు వివాహేతర సంబంధం కూడా తనకు ముఖ్యమని ఆమె తెలిపింది.తన అభిప్రాయాలు,భావాలు షేర్ చేసుకునేందు కు తోడు దొరికినందుకు తనకు చాలా ఉందని ఆమె తెలిపింది. దేశంలో వివాహేతర సంబంధాలు అధికంగా కోరుకుంటున్న నగరాల్లో రెండవ ప్లేస్లో ముంబై, మూడో ప్లేస్లో కోల్కతా, నాల్గవ ప్లేస్లో ఢిల్లీ, ఐదో ప్లేస్ లో పూణే నిలిచాయని గ్లీడన్ తెలిపింది.