ఎల్లో కలర్ శారీ కట్టుకుని.. సన్ గ్లాసెస్ పెట్టుకుని.. ఎడమ చేతిలో యాపిల్ ఫోన్… కుడిచేతిలో ఈవీఎం పట్టుకుని.. మెడలో ఈసీ ఐడీ కార్డ్ తో… పోలింగ్ సెంటర్ కు వెళ్తున్న ఓ యువతి ఫొటోలు ఇటీవల చాలామంది ఫోన్లలో తిరిగాయి. సోషల్ మీడియా సెలబ్రిటీగా మారిపోయింది. ఆమె ఎవరు అనేదానిపై చాలామందిలో ఆసక్తి ఏర్పడింది. ఆమె ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి అని, ఆమె పేరు రీనా ద్వివేది అని వెల్ల‌డైంది. 


తాజాగా, రీనా ద్వివేది మ‌రో ఆస‌క్తిక‌ర వార్త‌తో తెర‌మీద‌కు వ‌చ్చింది. రీనా ద్వివేది ఆస‌క్తిక‌రం విష‌యం ప్ర‌క‌టించారు. ఈమెకు రియాల్టీ షో..బిగ్ బాస్-13 సీజన్ లో పార్టిసిపేట్ చేయాలని ఉందట.. తనకు ఇప్పటికే మంచి గుర్తింపు వచ్చిందని, అయితే ఇలాంటి షో లలో పాల్గొంటే మరింత పాపులర్ అవుతానని రీనా ద్వివేదీ అంటోంది. తనకు మంచి చీరలు, డ్రెస్సులంటే చాలా ఇష్టమని, ఎప్పుడూ స్టయిల్ గా ఉండాలని అనుకుంటానని తెలిపింది. పోలింగ్ విధుల్లో గానీ,,ఆఫీసర్ గా ఆఫీసులో డ్యూటీ చేస్తున్నప్పుడు గానీ తన అందాలకే ప్రాధాన్యమిస్తానని ఈ భామ చెప్పింది. అన్నట్టు..ఈమెకు తొమ్మిదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్నాడట.. కానీ చాలామంది ఈ విషయాన్ని నమ్మడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: