పెళ్లి స్వర్గంలో నిర్ణయిస్తారు అంటారు. పెళ్లి కోసం రకరకాల పాట్లు పడుతుంటారు. గతంలో ఓ మాట చెప్పేవారు. ఆడపిల్లలకు పెళ్లి చేయడం అంటే మాములు విషయం కాదు. వరుడి గొంతెమ్మ కోరికలు తీర్చేసరికి అమ్మాయి తల్లిదండ్రులు హారతి కర్పూరంగా హరించుకుపోతారు అని.
ఇప్పుడు రోజులు మారాయి. మారిన రోజులకు అనుగుణంగా అమ్మాయిలు అబ్బాయిలు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. ఒకరినొకరు అర్ధం చేసుకొని పెళ్లి చేసుకుంటే.. పెద్దగా ఇబ్బందులు రావు. ఇప్పుడు అబ్బాయిల సంఖ్య కంటే అమ్మాయిల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో డిమాండ్ పెరిగింది.
అమ్మాయిల కోసం అబ్బాయిలు పడిగాల్పులు కాస్తున్నారు. పైగా ఇప్పుడు అమ్మాయిలు కూడా అబ్బాయిలతో సమానంగా ఉద్యోగాలు చేస్తుండటంతో..అసలు దొరకడం లేదు. ఇది వేరే సంగతి అనుకోండి. పెళ్లి కోసం అబ్బాయిలు పడుతున్న పాట్లు అన్ని ఇన్ని కాదు. ఏ మాట్రిమోనియల్ లో వెతికితినా అబ్బాయిల ఫొటోలే ఉంటున్నాయి.
ఎలాంటి అమ్మాయి కావాలి అనే దాని గురించి ఒక్కో అబ్బాయికి ఒక్కోరకమైన కోరిక ఉంటుంది. కోల్కతాకు చెందిన ఓ ప్రభుత్వ ఉపాద్యాయుడు ఓ ప్రకటన ఇచ్చాడు. తన వయసు 42 సంవత్సరాలు. తనకు వధువు కావాలని ప్రకటన ఇస్తూ.. అమ్మాయికి 10 కోట్ల రూపాయల ఆస్తి ఉండాలని మెన్షన్ చేశాడు. ప్రకటన ఇచ్చిన వ్యక్తి పేరు అందులో పెట్టకపోవడం విశేషం. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కోల్ కతా ఉపాధ్యాయుల సంఘం దీనిపై సీరియస్ అయ్యింది.