నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి గ్రామానికి చెందిన రిక్కల విలాస్ రెడ్డి ని ఈ అదృష్టం వరించింది. శనివారం అర్దరాత్రి తీసిన డ్రాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అక్షరాలా ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు రెండు కోట్లను గెలుచుకున్నాడు. హైదరాబాద్ లో ఉండే విలాస్ కొన్నేళ్ల క్రితం ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిడు. అక్కడ రెండేళ్ల పాటు డ్రైవర్ గా పని చేశారు. కొన్ని నెలల క్రితం మరోసారి వెళ్లిన విలాస్ కి పని దొరకకపోవటంతో నెలన్నర క్రితం తిరిగి వచ్చేశాడు.
అయితే మొదటిసారి దుబాయ్ వెళ్లినప్పుడు లాటరీ టికెట్లు కొన్నాడు. ఈ సారి తిరిగి వచ్చినప్పటికీ అక్కడి తన స్నేహితుడి ద్వారా మూడు టిక్కెట్లుకొన్నాడు. వాటిలో ఒక్క దానికి ఈ భారీ లాటరీ తగిలింది ఈ టికెట్లు కొనటానికి విలాస్ తన భార్య పద్మ దగ్గరే ఇరవై వేలు అప్పు చేయటం గమనార్హం. ఈ లాటరీతో తగలడంతో తాను ఎంతగానో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు ఆ రైతు.