బీపీ (బ్లడ్ ప్రెషర్).. ప్రతి మనిషిలో ఉండేది. ఉండాలి కూడా. తక్కువైనా సమస్యే.. ఎక్కువైనా సమస్యే. అయితే బీపీ ఎక్కువ అవ్వడానికి తక్కువ అవ్వడానికి మనం తీసుకునే ఆహారమే కారణం. మూత్రపిండాలు మన శరీరంలోని ద్రవాలను వడబోస్తూ అదనంగా వున్న ద్రవాల్ని విసర్జించేలా చేస్తూ శరీరంలోని నీటి శాతాన్ని సమానంగా ఉంచుతుంది. ఈ విధానం అంతా మన బీపీ మీద ప్రభావం చూపిస్తూ ఉంటుంది.


కాగా శరీరంలో ఎక్కువ ద్రవాలు నిల్వ వుండిపోతే బీపీ పెరిగిపోతుంది. తక్కువ వుంటే బీపీ పడిపోతుంది. ఈ రెండూ ప్రమాదమే. ఇలా శరీరంలోని ద్రవ పరిమాణం హెచ్చు తగ్గులకు గురికాకుండా కిడ్నీలు సోడియం, పోటాషియం అనే రసాయనాల మధ్య సమతూకాన్ని పాటిస్తాయి. పొటాషియం ఎక్కువగా నీటిని కిడ్నీల్లోకి చేరవేస్తే, సోడియం నీటిని కిడ్నీల్లోకి చేరకుండా నియంత్రిస్తుంది.


మనం ఆహారంలో తీసుకునే ఉప్పు వల్ల శరీరంలో నీరు ఎక్కువ నిల్వ వుండిపోయి బీపీ పెరిగిపోతుంది. ఇలా జరగకుండా వుండాలంటే అలా నిల్వ వున్న నీటిని కిడ్నీల్లోకి చేరవేసే పొటాషియం వున్న అరటి పండ్లు తీసుకోవాలి. అందుకే బీపీని ఎప్పుడు గుప్పెట్లో పెట్టుకోవాలి అనేది. చూసారుగా బీపీని తగ్గించాలి అంటే అరటి పండు అప్పుడప్పు తింటూ ఉండాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: