ప్రస్తుత పండుగల సీజన్‌లో రానున్నది దీపావళి. దానికి రెండు రోజుల ముందు ‘ధన్‌తేరస్' రాబోతోంది. ఆ రోజున పసిడి కొనుగోలు చేయడం అనే సంప్రదాయం అనాదిగా వస్తోంది. దీంతో నగల దుకాణాల దృష్టి మొత్తం దీనిపైనే ఉంది. బంగారం ధర గరిష్ఠ స్థాయి నుంచి 4 శాతం తగ్గినా.. గత ఏడాది దీపావళితో పోల్చి చూస్తే.. ఈ ఏడాది 20 శాతం అధికంగానే బంగారం ధరలు ఉన్నాయి. ఇకపోతే మరోవైపు పెరిగిపోతున్న బంగారం ధర కూడా కొనుగోలుదారులను ఆలోచనలో పడవేస్తోంది.


ధర కాస్త తగ్గాక చూద్దాంలే అని పలువురు భావిస్తున్నారు. బంగారం ధర చూసి అటు నగల దుకాణాల యాజమాన్యాలు కూడా భయపడుతున్నాయి. ధర చూసి కొనుగోలు దారులు జంకితే అమ్మకాలు పడిపోతాయి. అదీ వారి భయం. అందుకే కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు 'ధన్‌తేరస్', 'దీపావళి' సందర్భంగా ఆయా నగల దుకాణాలు పలు డిస్కౌంట్లు, ఆఫర్లు అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తన కస్టమర్లకు, కళ్యాణ్ జువెలర్స్ తాజాగా అదిరిపోయే మెగా దీపావళి ఆఫర్‌ ప్రకటించింది. అదేమంటే ఏకంగా 3 లక్షల గోల్డ్ కాయిన్స్ అందిస్తోంది.


సంస్థ ప్రతి వారం లక్కీడ్రా నిర్వహించనుంది. ఇందులో విజేతగా నిలిచిన వారు 100 బంగారు నాణేలను గెలుచుకోవచ్చు. ఇంతేగాక సంస్థ బంగారు ఆభరణాలపై తయారీ చార్జీలను రూ.199 నుంచే వసూలు చేస్తోంది. ప్రతి 8 గ్రాముల బంగారం జువెలరీ కొనుగోలుపై రూ.1,000 డిస్కౌంట్ అందిస్తోంది. అలాగే స్టడెడ్ జువెలరీ కొనుగోలుపై ఉచిత గోల్డ్ కాయిన్స్ ఆఫర్ చేస్తోంది..


తన షోరూమ్‌లలో కస్టమర్లు కొనుగోలు చేసిన బంగారు నగలపై 4 లెవెల్ అస్యూరెన్స్ సర్టిఫికేషన్ కూడా అందిస్తోంది. అంటే నాణ్యత విషయంలో ఎలాంటి దిగులు అవసరం ఉండదు. అన్ని నగలకు బీఐఎస్ హాల్‌మార్క్ ఉంటుంది. అలాగే సంస్థ షోరూమ్‌లలో కొనుగోలు చేసిన జువెలరీకి లైఫ్‌టైమ్ మెయింటెన్స్ సదుపాయం వర్తిస్తుంది. ఇకపోతే నవంబర్ 30 వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయని దుకాణ యాజమానులు తెలిపారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: