గవర్నమెంట్ కి అధికంగా  ఆదాయం తెచ్చేది దానిలో  మద్యం అమ్మకాలు కూడా ఒకటి. అసలు మందు తాగకపోతే  బతకలేని వాళ్లు కూడా చాలామంది ఉంటారు. ప్రస్తుతానికి మన రాష్ట్రంలో కూడా జగన్ గారు మద్యం అమ్మకాలు తగ్గించడానికి చాలా శ్రమిస్తున్నారు . అందులో భాగంగానే మద్యం దుకాణాలు గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుపుతూ టైమింగ్స్ తగ్గిస్తూ నెమ్మదిగా మద్యనిషేధ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దాలని ఆయన కోరుకుంటున్నారు.


బయటకెళ్లి మద్యం కొనకుండా ఇంట్లోనే మద్యం దొరికితే ఎంత బావుండునో అని మద్యపాన ప్రియులు కోరుకుంటారు. అలాంటిది ఏకంగా ఒంట్లోనే మద్యం ఉత్పత్తి అయితే ఇంకెంత బాగుండు అనుకుంటారు కదా! అతడెంత అదృష్టవంతుడోనని ఆశ్చర్యపోతారు. దీన్ని అనుభవిస్తున్న ఓ వ్యక్తి మాత్రం దీన్ని దురదృష్టకరమని భావిస్తున్నాడు. న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి డ్రైవింగ్‌ చేస్తుండగా ఆపి మద్యం స్థాయిని పరీక్షించారు. ఉండాల్సిన స్థాయి కంటే రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది. అధికారులు అతన్ని అరెస్ట్‌ చేసి కోర్టులో నిలబెట్టారు. అయితే ఇలాంటి ఓ కేసు గురించి విన్న అతని బంధువు అతడికి సహాయం చేసింది.


ఆహారంలో ఉన్న పిండిపదార్థాలను గ్లూకోజ్‌గా కాకుండా, మద్యంగా మార్చే ఓ ప్రత్యేక సూక్ష్మజీవి కడుపులో ఉండటంతో  ఈ పరిస్థితి ఎదురైంది. ఓ డాక్టర్‌ పర్యవేక్షణలో అతడిని ఉంచారు. అధిక పిండిపదార్థాలు ఉన్న ఆహారాన్ని అతడు తీసుకున్నపుడు రక్తంలో మద్యం స్థాయి  పెరగడాన్ని గుర్తించారు. పిండిపదార్థాలు అధికంగా లేని ఆహారాన్ని స్వీకరించినపుడే మద్యం స్థాయి లేదు.

దీంతో అతన్ని కోర్టు మన్నించింది. ఈ అంతుచిక్కని వ్యాధి పరిశీలన దశలోనే ఉందని పరిశోధకులు బార్‌బరా కార్డెల్‌ అన్నారు. ఈ వ్యాధితో బాధపడుతున్నవారు మద్యం సేవించినట్లు కనిపిస్తారు. మద్యం వాసన వస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది షుగర్‌ వ్యాధి ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: