చేతివేలి గోళ్ళతో, పొడవైన కురులతో రికార్డులు సృష్టించవచ్చని నిరూపించారు భారతీయులు. అదికూడా మాములు రికార్డు కాదు ఏకంగా
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సాధించాలని ఎంతోమంది కలలు కంటారు. ఎంతోమంది ఆ కలను సాకారం చేసుకున్నారు. 80 మంది భారతీయులకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ 2020లో చోటు దక్కింది.
పెంగ్విన్ రాండ్సమ్ హౌస్ ప్రచురణ సంస్థ తాజా పుస్తకాన్ని విడుదల చేసింది. ఇందులో వేలాది కొత్త రికార్డులు, ప్రత్యేక కేటగిరీలు ఉన్నాయని పేర్కొంది. అన్నీ వయసుల వారికి విజ్ఞానంతో పాటు వినోదం కలిగించేలా దీన్ని తీర్చిదిద్దినట్లు తెలిపింది. దీంట్లో భారతీయులకు సంబంధించి 80 అంశాలు ఉన్నట్లు వివరించింది. నాగ్పూర్కు చెందిన
జ్యోతి అమాజి ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా (24.7 అంగుళాలు) గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకున్నారు.
అలాగే ప్రపంచంలోనే పొడవైన కురులున్న యువతిగా నీలాన్షి పటేల్ (16) గిన్నిస్లో చోటు దక్కించుకున్నారు. ఆమె జుట్టు పొడవు 5.7 అడుగులు. పుణెకు చెందిన శ్రీధర్ పొడవైన చేతివేలి గోర్లు (909.6 సెం.మీ) కలిగిన వ్యక్తిగా రికార్డుల్లో నిలిచారు.
భారత్లో ప్రజా రవాణా ద్వారా అత్యంత దూరం (29,119 కి.మీ) ప్రయాణించిన వారిగా జ్యోత్స్నా మిశ్రా, దుర్గా చరణ్ రికార్డు సాధించారు. పది బార్స్ కిందుగా అత్యంత వేగంగా స్కేట్ చేసిన (2.06 సెకండ్లు) ఘనతను నవీన్ కుమార్ సాధించారు.
736 రకాల కాగితం కప్పులు సేకరించిన వ్యక్తిగా తమిళనాడుకు చెందిన శంకరనారాయణన్ నిలిచారు. 2018లో
ఫిబ్రవరి 18 నుంచి మార్చి 30 వరకు భారత దేశం అంతటా 29 వేల 119 కిలోమీటర్లు దూరం ప్రయాణించిన జోత్స్నా మిశ్రా, దుర్గా
చరణ్ లు.
ఇలా చెప్పుకుంటే అనేక ఆసక్తికరమైన విషయాల సమాహారంగా గిన్నిస్ను రూపొందించినట్టు నిర్వాహకులు చెబుతున్నారు.