కావాల్సిన ప‌దార్థాలు: 
రొయ్యలు- అర‌కిలో
చింత చిగురు- కప్పు
ఉల్లిపాయ- ఒకటి
దాల్చిన చెక్కపొడి - అరచెంచా


అల్లంవెల్లులి పేస్టు- చెంచా
ధనియాల పొడి- చెంచా
జీలకర్రపొడి- అరచెంచా
కొత్తిమీర- కట్ట


వెల్లుల్లి రేకలు- ఐదారు
నూనె- మూడు టేబుల్‌స్పూన్లు
గసగసాల పొడి - చెంచా


పచ్చిమిర్చి- ఐదు
కారం - చెంచా
పసుపు- చిటికెడు
ఉప్పు- తగినంత


త‌యారీ విధానం:
రొయ్యలని శుభ్రం చేసి పెట్టుకుని అందులో పసుపూ, కొద్దిగా ఉప్పూ, సగం అల్లంవెల్లుల్లి పేస్టు వేసి వాటికి పట్టేట్టుగా కలిపిపెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో నూనె వేసి అందులో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చీ వేసి వేయించుకోవాలి. అవి వేగాక అందులో రొయ్యలు కూడా వేయాలి. పచ్చివాసన పోయేవరకూ వేయించి అప్పుడు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు చింతచిగురుని కూడా రొయ్యల్లో వేసి మిగిలిన అల్లంవెల్లుల్లి పేస్టూ, వెల్లుల్లిరేకలూ చేర్చాలి. 


ఆ తర్వాత త‌గినంత ఉప్పు, కారం, గసగసాలపొడీ, జీలకర్రపొడి, దాల్చిన చెక్కపొడి, ధనియాలపొడి వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టేయాలి. బాగా ఉడికాక చివిరిలో కొత్తిమీరు వేసి ఒక సారి తిప్పి స్టౌ ఆఫ్ చేయాలి. అంతే చింతచిగురు రొయ్యల క‌ర్రీ..!


మరింత సమాచారం తెలుసుకోండి: