ఈ రోజుల్లో కట్టుకున్న భర్త ఉన్నప్పటికీ పరాయి మగాడితో అక్రమ సంభందం పెట్టుకొని తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. దీనితో పచ్చని కాపురం బూడిదై పోతుంది. అయితే వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి ప్రియురాలి భర్త చేతిలో దారుణహత్యకు గురైన సంఘటన హైదరాబాద్లో కలకలం రేపింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ రవి.. భార్య, కుమారుడితో కలిసి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ వలస వచ్చి కొత్తపేటలో నివాసముంటున్నాడు. రవి భార్యకు సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం మాచనూరు గ్రామానికి చెందిన కె.ప్రణీత్రెడ్డి(24) చిన్ననాటి స్నేహితుడు.
ప్రణీత్ రెడ్డి ఏదైనా పని మీద దగ్గర్లో ఉన్న నగరానికి పోతుంటాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. రవి ఇంట్లో లేని సమయంలో ప్రణీత్రెడ్ది వచ్చి ఆమెతో రాసలీలలు కొనసాగించేవాడు. ఈ విషయం తెలుసుకున్న రవి వారిద్దరిని రెడ్హ్యాండెడ్గా పట్టుకునేందుకు ప్లాన్ వేశాడు. సోమవారం పనికి వెళ్తున్నట్లు భార్యకు చెప్పి బయటకు వెళ్లిపోయాడు. దీంతో అతడి భార్య ప్రియుడికి ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుంది.
భర్త ఇంట్లో లేడని ఇద్దరు సెక్స్ లో మునిగిపోయారు. వారిద్దరూ బెడ్రూమ్లో రాసలీలల్లో మునిగితేలిన సమయంలో తన భర్త వచ్చి ఒక్కసారిగా ఇంట్లోకి వెళ్లి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. భార్యను, మూడేళ్ల కొడుకును బయటకు పంపి ప్రణీత్ తలపై కర్రతో బలంగా కొట్టాడు. దీనితో ప్రణీత్ కు తీవ్ర రక్త స్రావం కోరడంతో అక్కడక్కడికే చనిపోయారు.