యుక్త వయసు వచ్చిన ఆడపిల్లల్లో తొలిసారి రుతుస్రావం జరిగితే ఆమె పెద్దమనిషి అయిందని తెలుగు సంస్కృతిలో దాన్ని ఓ వేడుకగా చేసుకుంటారు.కానీ, పాశ్చాత్య దేశాల్లో పరిస్థితి భిన్నం. తొలిసారి నెలసరి ప్రారంభమైందని తెలిస్తే అక్కడి అమ్మాయిలు తీవ్రమైన భయాందోళనకు గురవుతుంటారు.అయితే, బ్రిటన్‌లోని చాలా మంది బాలికలు రజస్వల అయ్యామని తెలియగానే ఆందోళన చెందుతున్నారని ఇటీవల వెలువడిన అధ్యయనంలో తేలింది.

 

నెలసరి ప్రారంభంకాగానే వారు దానిపై సౌకర్యవంతంగా చర్చించలేకపోతున్నారట. ప్రతి 10 మందిలో ఒకరు తాము శానిటరీ ప్యాడ్లను కూడా కొనే ఆర్థికస్థితి లేదని చెబుతున్నారు.బ్రిటన్‌లోని మూడున్నర లక్షల మంది బాలికలు పీరియడ్స్ సమయంలో స్కూల్‌కు వెళ్లలేకపోతున్నారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఓ కొత్త ట్రెండ్ బ్రిటన్‌లో మొదలైంది.భారత్‌లోని తెలుగు, తమిళ ప్రాంతాల్లో అలాగే శ్రీలంకలో బాలికలు రజస్వల అయితే దాన్ని వేడుకగా చేసుకుంటారు. సమాజానికి ఈ విషయం చేరేలా చేస్తారు.

 

ఇప్పుడు బ్రిటన్‌‌లో కూడా వారి సంస్కృతికి తగ్గట్టుగా ఇలాంటి కార్యక్రమాలను వేడుకగా చేసుకుంటున్నారు.పీరియడ్‌కు సంబంధించిన అపోహలపై చైతన్యం తెచ్చేందుకు ఇటీవల 'ఫ్రీ బ్లీడ్' పేరుతో ఒక ఉద్యమం వచ్చింది. నెలసరి వచ్చిన మహిళలు శానిటరీ ప్యాడ్‌లు వాడకుండా మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనే కార్యక్రమమే 'ఫ్రీ బ్లీడ్' ఉద్యమం.

 

ఇప్పుడు పీరియడ్ పార్టీల పేరుతో ఓ కొత్త కార్యక్రమం వైరల్‌గా మారుతోంది.ఇంగ్లాండ్‌లో చాలా కాలం నుంచి ఈ పీరియడ్ పార్టీల ట్రెండ్ నడుస్తోంది. అయితే, గత ఏడాది ఆగస్టు నుంచే ఇది వైరల్‌గా మారింది.ఒక అమెరికా టీవీ షోకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హాస్య నటుడు బెర్ట్ క్రైషర్ మాట్లాడుతూ, ''నా కూతురు పీరియడ్ పార్టీ ఇచ్చింది, ఆమె ఫ్రెండ్స్ అందరూ పీరియడ్ పార్టీ ఇస్తున్నారని చెప్పింది'' అని ఆ షోలో పేర్కొన్నారు. ఇది నా జీవితంలో గొప్ప సమయం అని కూడా అన్నారు.నెలసరిని ప్రతిబింబించేలా ఈ పార్టీలో అన్ని ఎరుపు రంగులో ఉండే ఆహార పదార్థాలను అతిథులకు అందిస్తారు. రెడ్ కలర్ కేక్‌ను సూచికగా పెడుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: