వైభవంగా అలంకరించిన పెళ్లి పందిరి. ఓ పక్క వేద మంత్రాలు  చదువుతున్న పంతులు.. ఇక కొద్దిసేపట్లో పెళ్లి జరగడమే అనుకోగా బావ మరదళ్ల మద్య  వచ్చిన చెప్పుల గొడవ పెళ్లి క్యాన్సిల్ చేసుకునేందుకు దారి తీసింది. చెప్పుల వల్ల పెళ్లి ఆగడం ఏంటని అనుకోవచ్చు. అందుకు కారణం ఉంది. 

 

పెళ్లి పందిరిలో అడుగుపెట్టే బావ గారితో సరదాగా ఏడిపిస్తే ఆ కిక్కే వేరు. ముఖ్యంగా మరదళ్లు ఆ అవకాశం కోసం ఎదురుచూస్తారు. అయితే అలాంటి టైంలో బావ గారి వస్తువులను దాచి వారి దగ్గర డబ్బులు వసూలు చేసి ఆటపట్టించడం కామన్. అయితే అలానే తన బావ ని ఆటపట్టించాలని అనుకున్న ఒక మరదలికి పెద్ద షాక్ తగిలింది. ఏదో సరదాగా వరుడి చెప్పులు దాస్తే వాటి కోసం వెతికి చిరాకు పుట్టిన పెళ్లి కొడుకు తన మరదలిని బండ బూతులు తిట్టాడట. 

 

అది తెలుసుకున్న అమ్మాయి తరపున పెద్దలు ఏదో చిన్న పిల్ల సరదాగా చేస్తే దానికి ఎందుకు సీరియస్ అవుతావు అని అడిగారట. దానితో అతనికి కోపం ఎక్కువై అమ్మాయికి సంబందించిన ఒకరిని చేయి చేసుకున్నాడట. దానితో ఇంత కోపం ఉన్న వ్యక్తి తనకు భర్తగా వద్దు అని పెళ్లి కూతురు పెళ్లి మండపం నుండి వెళ్లిపోయిందట. అంతేకాదు అమ్మయికి ఇచ్చిన కట్న కానుకలు కూడా తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. 

 

అమ్మాయి గట్టి పట్టు పట్టడంతో అతనితో పెళ్లి క్యాన్సిల్ చేయాల్సి వచ్చిందట. పందిట్లో పెళ్లి జరుగుతుందని అనుకున్న ప్రజలు సైతం అవాక్కయ్యేలా పెళ్లి క్యాన్సిల్ అయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: