ఈ ఏడాది అందాల పోటీల్లో నల్ల కలువలే సత్తా చాటారు. మిస్ యూనివర్స్‌గా దక్షిణాఫ్రికాకు చెందిన యువతి ఎంపిక కాగా, ప్రపంచ సుందరిగా జమైకాకు చెందిన టోనీ యాన్ సింగ్ ఎంపికైంది. చివరివరకు గట్టిపోటీ ఇచ్చిన మిస్ ఇండియా సుమన్ రావు మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 

 

ప్రపంచ సుందరి కిరీటాన్ని జమైకా భామ టోనీ-యాన్‌ సింగ్‌ గెలుచుకుంది. లండన్‌ వేదికగా జరిగిన తుది పోటీల్లో యాన్ సింగ్ విజేతగా నిలవడంతో 2018 మిస్ వరల్డ్ వనెస్సా పోన్సె ఆమెకు కిరీటం అలంకరించారు. మొదటి రన్నరప్‌గా ఫ్రాన్స్‌కు చెందిన ఒఫెలే మెజినో, రెండో రన్నరప్‌గా భారత్‌కు చెందిన సుమన్‌రావు నిలిచారు. టోనీ యాన్ సింగ్‌కు తుది వరకు ఒఫెలే, సుమన్ రావు నుంచి గట్టిపోటీ ఎదురయ్యింది. అయితే, చివరి ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానంతో న్యాయనిర్ణేతలు సంతృప్తి చెంది ఆమెను యాన్ సింగ్‌ను ప్రకటించారు. 

 

వైద్య విద్య పూర్తిచేసిన యాన్ సింగ్.. అమెరికాలోని ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో ఉమెన్స్ స్టడీస్, సైకాలజీలో పీజీ చేశారు. అలాగే ఫ్లోరిడా యూనివర్సిటీలో కరేబియన్ స్టూడెంట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గానూ పనిచేశారు.  ప్రపంచ సుందరి కిరీటాన్ని గెలుచుకున్న నాలుగో జమైకా యువతిగానూ టోనీ యాన్ సింగ్ రికార్డులకు ఎక్కారు. యాన్ సింగ్‌కు పాటలు పాడటం, వంట చేయడం హాబీ. రెండో రన్నరప్‌ సుమన్‌రావు ది రాజస్థాన్‌. ఈ ఏడాది జూన్‌లో జరిగిన మిస్‌ ఇండియా పోటీల్లో ఆమె విజేతగా నిలిచారు. ఈ ఏడాది మిస్ వరల్డ్ పోటీల్లో 120 దేశాలకు చెందిన యువతులు పాల్గొన్నారు. నవంబరు 20 మొదలైన ఈ పోటీల్లో వివిధ దశల తర్వాత ఫైనల్స్‌కు 10 మంది అర్హత సాధించారు. 


మొత్తానికి ప్రపంచ సుందరిగా ఓ నల్ల కలువ కిరీటాన్ని సొంతం చేసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జమైకా ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోతున్నాయి. ఇది తమదేశానికి దక్కిన గౌరవం అంట మురిసిపోతున్నాయి. అటు టోనీ-యాన్ సింగ్ కు ఘన స్వాగతం లభించింది. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: