మధ్యప్రదేశ్ కి చెందిన ఓ వ్యక్తి ఒకే వేదిక పై రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న వీడియో నేట్టింట్లో వైరల్ అవుతోంది. ఒక పెళ్లి చేసుకుంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి, వీడెవడ్రా బాబు ఒకే స్టేజి మీద రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న ఆ అభాగ్యుడు ఎవరు అంటూ ఎంతో మంది ఆ వ్యక్తిని చూడాలని తహతహలాడుతున్నారు. ఈ క్రమంలోనే ఆ వీడియో అత్యధిక వ్యూస్ సాధించింది కూడా. సరే అసలు అతడు రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నాడు. చట్టంలో రెండు పెళ్ళిళ్ళు తప్పు కదా మరి పోలీసులు ఎందుకు ఆ పెళ్లిని నిలపలేదని ఆలోచన చేస్తున్నారా. సరే అసలు విషయంలోకి వెళ్తే..

 

దిలీప్ ఆకా అనే 35 ఏళ్ళ వ్యక్తి, 28 ఏళ్ళ వయసు ఉన్న దీపు ని 9 ఏళ్ళ క్రితం పెళ్లి చేసుకున్నాడు. వారి ఇద్దరికీ ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. వారి జీవితం సాఫీగా సాగుతున్న క్రమంలోనే అతడి భార్య దీపు కి అనారోగ్య సమస్య వచ్చి పడింది. దాంతో ఏమి చేయాలో పాలుపోలేదు. వెంటనే అతడి భార్యకి ఓ ఆలోచన వచ్చింది. తన చెల్లిలిని ఇచ్చి పెళ్లి చేస్తే తన భర్తని, పిల్లలని కూడా బాగా చూసుకుంటుంది అనుకుంది.దాంతో

https://www.facebook.com/newstodaychannelhyd/videos/2621494494600043/

తల్లి తండ్రులకి , భర్తకి ఈ విషయం చెప్పి చెల్లిని సైతం ఒప్పించ్చింది. ఎట్టకేలకి పెద్దలందరి ఇష్టంతో, ఆమె చెల్లెలు రచనా అంగీకారంతో ఒకే వేదికపై ఆమె చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇదే వేదికపై తన భార్యకి కూడా తాళి కట్టాలని అనుకుని ఆమెకి కూడా తాళి కట్టాడు. అయితే భార్య ఉండగా మరొక పెళ్లి చేసుకున్న అతడిపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని అందుకే ఎలాంటి కేసు నమోదు చేయలేదని స్థానిక పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: