తీపి, చేదు అనుభవాలతో కూడిన వర్తమాన 2019 సంవత్సరానికి ఘనంగా వీడ్కోలు పలికి కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టేందుకు నగరంలోని పలు హోటళ్లు, పబ్‌లు, క్లబ్‌లు, రిసార్ట్స్‌లు 31వ తేదీ రాత్రి నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. శివార్లలోని పలు రిసార్ట్స్‌లు, నగరంలోని పలు ఐదు నక్షత్రాల హోటళ్లు ఆకర్షనీయమైన ప్యాకేజీలతో యువతను ఆకట్టుకునేందుకు ఇప్పటికే ఆఫర్లను ప్రకటించాయ. పలు చోట్ల ఉచితంగా డీజే పార్టీలు ఏర్పాటవుతున్నాయ. మరికొన్ని చోట్ల 31 రాత్రి నూతన సంవత్సరం వేడుకను పురస్కరించుకుని డిస్కౌంట్‌లు ఇస్తుండగా, మరికొన్ని బహుళ జాతి కంపెనీలు, ఐటీ కార్పొరేట్ సంస్థలు తమ ఉద్యోగుల కోసం ప్రత్యేక వేదికలను ఏర్పాటు చేయటంలో నిమగ్నమై ఉన్నాయి. జంటల వారీగా, ఒంటరిగా, చిన్నారులకు వేర్వేరుగా ఛార్జీలను నిర్ణయించారు.

 

 బేగంపేట కంట్రీక్లబ్‌లో న్యూ ఇయర్ బాష్ పేరుతో వేడుకలు జరగనున్నాయి. ఇక్కడ జరిగే వేడుకలకు టాలీవుడ్, బాలీవుడ్ నటీమణులు హాజరు కానున్నారు. క్లబ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్ ప్రెస్‌క్లబ్, సోమాజిగూడలో హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ కొత్త సంవత్సర వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ జరిగే వేడుకల్లో ప్రముఖ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ దంపతులు హాజరు కానున్నారు.
బంజారాహిల్స్‌లోని తాజ్ బంజారాలో న్యూ ఇయర్ ఇవ్-2019 పేరుతో వేడుకలు కొనసాగుతాయి. ఇక్కడ జరిగే వేడుకలకు ప్రముఖ డీజేల ప్రదర్శన ఉంటుంది.
\బంజారాహిల్స్‌లోని తాజ్‌కృష్ణలో ద ఎక్స్‌పీరియన్స్ పేరుతో వేడుకలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో అంతర్జాతీయ డీజేలతో పాటు వర్ధమాన తారల ప్రదర్శన‌లు ఉంటాయి.
బంజారాహిల్స్‌లోని తాజ్‌దక్కన్‌లో అల్టిమేట్ ఇవ్ పేరుతో వేడుకలు జరగనున్నాయి. వివిధ దేశాలకు చెందిన డిజేలు అందించే మ్యూజిక్‌తో పాటు ప్రముఖ డ్యాన్సర్లు, మోడల్స్ ఇందులో పాల్గొంటున్నారు.
ఐటీసీ ఐటీసీ గ్రాండ్ కాకతీయలో న్యూ ఇయర్ ఈవ్-2019 పేరుతో వేడుకలు. అర్థరాత్రి వరకు డీజే హోరు, అన్‌లిమిటెడ్ నృత్యాలు ఇందులో ప్రత్యేకంగా నిలవనున్నాయి.
లక్డీకాపూల్‌లోని హోటల్ హ్యామ్‌స్పైర్‌లో రూప్‌టాప్ పేరిట ప్రత్యేక సంగీత కార్యక్రమం, దీనికి డీజే శ్యామ్ హాజరు కానున్నారు.


 బేగంపేటలోని యూఎస్ కాన్స్యులెట్ లైన్‌లోని చిరాన్ ఫోర్టు క్లబ్‌లో రాత్రి 8 గంటల నుంచి రాత్రి పనె్నండున్నర గంటల వరకు ‘న్యూ ఈయర్ ఈవ్’ పేరిట సంగీత కార్యక్రమం జరగనుంది. డీజే ప్రవీణ్ సారథ్యంలో జరిగే ఈ కార్యక్రమాన్ని బాలీవుడ్ సింగర్ తరబ్‌ఖాన్, మేయిల్ సింగర్ రాజ్‌కుమార్, స్టాండప్ కామేడియన్ షరీఫ్, బాలీవుడ్ డ్యాన్స్ ట్రూప్, మిమిక్రీ షరీఫ్, యాంకర్లు సన్నీ, జానూ (జెమిని మ్యూజిక్) హాజరు కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: