కామా తురాణం న భయం న లజ్జా అని ఊరికే అనలేదు. కళ్ళు మూసుకుపోయి కామంతో కొట్టుకుని పోయే వెధవలు ఉన్నంత వరకూ రోజుకో మహిళ బలైపోతూనే ఉంటుంది. ఈ మధ్య కాలంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు ఆడపిల్లల తల్లితండ్రుల వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణా రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాల ఘటనలు రోజు రోజుకి శ్రుతి మించుతున్నాయి. మొన్న దిశ, ఘటన, రెండు రోజుల క్రితం మతిస్థిమితం లేని మహిళపై అత్యాచార ఘటన ఇవన్నీ మరువక ముందే....

 

ఓ హిజ్రా పై ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని బాచుపల్లి ప్రాంతానికి చెందిన ఓ హిజ్రా ఆటో ఎక్కింది. ఆమె ఆటో ఎక్కింది మొదలు ఆటో డ్రైవర్ ఆమెతో అసభ్యంగా మాట్లాడటం మొదలు పెట్టాడు.  ఈ క్రమంలోనే తన స్నేహితులకి ఫోన్ చేసి రమ్మని చెప్పి, తన స్నేహితులతో కలిసి ఆటోని ఓ నిర్మానుష్య  ప్రాంతానికి తీసుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. వారి నుంచి  ఎలాగోలా తప్పించుకున్న ఆమె రాత్రి సమయం కావడంతో ఉదయాన్నే పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు చేసింది.

 

హిజ్రా చేసిన ఫిర్యాదు పై వెంటనే స్పందించిన పోలీసులు అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ మహేష్ ని అదుపులోకి తీసుకున్నారు. సమాజంలో వయసుతో సంభందం లేకుండా ఆడవారిని వదలని కామాంధులు చివరికి హిజ్రాలపై కూడా అత్యాచారాలు చేస్తుండటం చూస్తుంటే పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చని పలు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఆటో డ్రైవర్ కి కటినంగా శిక్షించాలని బాధిత హిజ్రాకి మద్దతుగా పలు హిజ్రా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: