న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఎక్క‌డ చూసిన పార్టీలు, ప‌బ్బులు, డీజేలు, డ్యాన్సులు, కేక్‌ కట్టింగ్‌ల‌తో హోరెత్తించారు.  సరికొత్త ఆశలతో ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ నేప‌థ్యంలోనే దేశవ్యాప్తంగా న్యూ ఇయర్‌ సంబరాలు అంబరాన్నంటాయి. అయితే టాలీవుడ్ స్టార్ హీరోల్లో కొందరు కుటుంబ సభ్యులతో నూతన సంవత్సరంలో కలిసిన ఇక్కడే జరుపుకోనున్నారు. మరి కొందరూ సినిమా షూటింగ్ ముంగిచుకొని విదేశాలకు వెళ్లి అక్క‌డ ఎంతో ఘ‌నంగా న్యూ ఇయ‌ర్ ఎంజాయ్ చేశారు. ఇక‌ తెలుగు ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్యామిలీ ప‌ర్స‌న్ ఎవ‌రంటే మ‌రో ఆలోచ‌న లేకుండా మ‌హేష్ బాబు అని చెప్పాలి. 

 

ఎందుకంటే ఈయ‌న‌కు ఏ మాత్రం షూటింగ్‌లో టైమ్ దొరికినా వెంట‌నే కుటుంబాన్ని తీసుకుని విదేశాల‌కు వెళ్లిపోతాడు. దొర‌క్క‌పోయినా దొరికించుకుని మ‌రీ వెళ్తుంటాడు. అయితే మహర్షి సినిమా తర్వాత మాత్రం ఈయనకు టైమ్ దొరకలేదు. అయితే ఆ సారి సూప‌ర్ స్టార్ మహేష్ బాబు దుబాయ్‌లో కుటుంబంతో నూతన సంవత్సర వేడుకల్లో జ‌రుపుకున్నారు. అలాగే ఈ సందర్భంగా ‘చిల్లింగ్ ఎట్ మిక్స్ ది బాయ్స్’ అంటూ ట్యాగ్ లైన్‌తో దుబాయ్‌లో స్నేహితులతో కలిసి దిగిన ఫొటోని కూడా షేర్ చేశారు మహేష్ బాబు. కాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్ తర్వాత ఎప్పటిలాగే కాస్త విశ్రాంతి తీసుకోవాలని భావించారు. 

 

సినిమా చేసిన వర్క్‌ మూడ్‌లో ఉంటే సూపర్ స్టార్ హాలిడే మూడ్‌లోకి వెళ్లారు. అనిల్‌ రావిపూడి డైరక్షన్‌లో మహేశ్‌బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్‌ ఇటీవలే కంప్లీట్ అయింది. సినిమా షూటింగ్ పూర్తికాగానే మహేశ్ తన పాత్రకు డబ్బింగ్ చేప్పేసి రిలీఫ్ అయ్యారు. ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌ ప్లాన్ చేశారు. వారం రోజులపాటు హాలీడే ట్రిప్ ప్లాన్ చేశారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. వారం రోజుల అనంతరం తిరగి వచ్చి చిత్ర ప్రమోషన్స్ లో బిజీ కానున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: