సంక్రాంతి యొక్క మూడు పర్వదినాలలో మొదటి రోజైన భోగి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది తెల్లవారకముందే పిల్లా పెద్దా అంతా కలిసి ఎంతో ఆనందంగా తమలో ఉన్న చెడు ఆలోచనలను  దహించి వేస్తున్నట్లుగా ఇంటి ముందు వేసుకునే భోగిమంట. కానీ తర్వాత అందరికీ భోగి రోజున ముఖ్యంగా గుర్తువచ్చేది రేగిపండ్లు. ఈరోజు సాయంత్రం పెద్దలు తమ ఇంట్లో చిన్నారులపై రేగి పండ్లు పోస్తారు. అలాగే వాటితోపాటు భోగి పండ్ల కోసం చెరుకుగడలు, బంతి పూల రెక్కలు, చిల్లర నాణేలు కూడా వాడతారు కొందరైతే సెనగలు కూడా కలుపుతారు.

 

ఇంతకీ రేగుపండ్లను పిల్లల మీద పోయడం వల్ల వచ్చే లాభం ఏమిటంటే.. ఇలా చేయడం వల్ల శ్రీమన్నారాయణుడి దివ్యమైన ఆశీస్సులు వారికి లభిస్తాయని నమ్ముతారు. అలాగే భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలపై ఉన్న చెడు దృష్టి తొలగిపోతుందని మరియు తల పైభాగంలో ఉన్న బ్రహ్మరథం దీనివల్ల ప్రేరేపితమై పిల్లల్లో మంచి జ్ఞానాన్ని మెరుగుపరుస్తుందని భావిస్తారు. ఈరోజు పట్టణాల్లో సంప్రదాయం తగ్గిపోయింది కానీ ఇప్పటికీ పల్లెల్లో సాయంత్రం రోజున పెద్దలు పిల్లల తలపై రేగి పండ్లు మరియు భోగి పండ్లు పోస్తారు.

 

ఇంకా చెప్పాలంటే భోగి ముగిశాక సూర్యుడు దక్షిణాయణం నుంచి ఉత్తరాయణానికి వెళతాడు. రోజే మకర రాశిలోకి అడుగుపెడతాడు. సంక్రాంతి సూర్యుడి పండుగ.. కాబట్టి సూర్యుణ్ని పోలిన గుండ్రని రూపం, ఎర్రటి రంగు కారణంగా దీనికి అర్కఫలం అనే పేరు వచ్చింది. సూర్యభగవానుడి ఆశీస్సులు పిల్లవాడికి లభించాలనే సూచనగా భోగిపండ్లను పోస్తారు. కౌమర్యంలోకి అడుగు పెట్టడానికి ముందే అంటే.. 12 ఏళ్లలోపు చిన్నారుల తలపై భోగి పండ్లను పోయవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: