సాధారణంగా ఎవరైనా ఫేమస్ పర్సాలిటీస్ ఉంటే వారి గురించి తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది.. ఆ కోణం వారు అమితంగా ఇష్టపడే వారి గురించి తెలుసుకోవడానికి గూగుల్ తల్లి సాయం అందుకుంటారు..అలా వారి జీవిత విశేషాల గురించి తెలుసుకొంటారు..  సెలెబ్రెటీలు లేదా సంఘాన్ని ఒక తాటిపై నడిపేవారి గురించి తెలుసుకోవాలని ఉస్తాహం కూడా ఎక్కువగానే ఉంటుంది..

 

ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ యూట్యూబ్ యూజర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన వివరాలు ఆసక్తికరంగా మారాయి. టెక్నాలజీకి సంబంధించి చాలా విషయాలు ఆయన మాట్లాడినా.. ప్రపంచంలోని వివిధ దేశాలకు చెందిన వారు మాత్రం ఆయన పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకే ఎక్కువ ఆసక్తిని చూపించటం గమనార్హం.

 

మహానుభావులు మామూలు వాళ్లకు అర్థం కాదని చాలా మంది అంటారు. అందుకే..ఈ ట్విట్టర్ వ్యక్తీ గురించి కూడా చాలా మంది వెతికారు. ఈ క్రమంలో అందరికీ దిమ్మతిరిగే కొన్ని నిజాలు వెలుగు చూశాయి.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము..జాక్ డోర్సీ.. వారానికి ఏడుసార్లు మాత్రమే తాను భోజనం చేస్తానని చెప్పారు. అది కూడా రాత్రివేళలోనే తాను తింటానని చెప్పారు. గతంలో ఆయన ఐదు సార్లు మాత్రమే భోజనం చేస్తానని చెప్పారని.. ఇప్పుడు మరో రెండుసార్లు పెంచినట్లుగా కొందరునెటిజన్లు సటైర్లు వేస్తున్నారు. అయితే.. ఆయన మాత్రం ఈ విషయాల్ని పెద్దగా పట్టించుకోవటం లేదు.

 

వారంలో ప్రతిరోజూ డిన్నర్ మాత్రమే చేస్తానని.. తాను తీసుకునే ఆహారంలో చేపలు.. చికెన్.. ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటానని వెల్లడించారు. తానుప్రతి రోజూ ఉత్సాహంగా పని చేస్తానని.. నిద్ర కోసం బెడ్ మీదకు వాలిన పది నిమిషాల వ్యవధిలోనే నిద్ర వస్తుందని చెప్పారు.ప్రతి రోజూ విటమిన్ సీ తీసుకుంటానని.. విటమిన్ డీ కోసం తాను రోజూ ఆఫీసుకు నడిచి వెళతానని చెప్పారు. అప్పుడప్పుడు ఉపవాసం ఉంటానని చెప్పారు. ఉదయం పదిహేనునిమిషాలు ఐస్ బాత్ చేస్తానని అన్నారు..అలా చేస్తే ఆయన మెదడు చురుకుగా పనిచేస్తుందని అనడంతో సోషల్ మీడియాలో ఈ మాటలు వైరల్ అవుతున్నాయి..

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: