ప్రస్తుతం యువతరం ఎంత ఫాస్ట్గా ఉంటున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. టెక్నాలజీ పెరిగే కొద్దీ అన్ని విషయాల పైన అవగాహన పెరుగుతోంది. దాంతో కొంత మంది పిల్లలు పదోతరగతిలోనే సెక్స్ అనుభూతిని పొందుతున్నారని తాజా సర్వేలో తేలింది. చిన్న వయసులో ప్రేమలో పడటంతో శారీరకంగా దగ్గరవ్వాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. ఓ పదేళ్ళ క్రితం అవి కేవలం ముద్దులుపెట్టుకోవడం, కౌగిలించుకోవడం వరకే ఉండేది. ప్రస్తుతం అలా ఉండటం లేదు.
నేటి తరం యువతలో అంత ఓపిక ఉండటం లేదు. ప్రేమ పేరుతో సెక్స్ని అనుభవిస్తున్నారు. ఇక ఈ టీనేజర్లు చెప్పే విషయం ఏమిటంటే ప్రేమలో ఉన్నాం కాబట్టే అవతలి మనిషికి శారీరకంగా కలుస్తున్నాం అంటున్నారు. కన్యత్వానికి విలువిచ్చే ఐదవ మంది మాత్రమే ఆ అనుభవానికి దూరంగా ఉంటున్నారు. మిగిలిన ఆరు శాతం మంది తమకు తగ్గ పార్టనర్ దొరకలేదని చెబుతున్నారు. పదిశాతం మంది పిల్లల్లో ముగ్గురు సెక్స్లో పాల్గొంటున్నారు. ఒకప్పుడు ఇద్దరు మాట్లాడుకోవాలంటే భయపడుతూ ఉండేవారు.
ప్రస్తుతం అలా లేదు ఏకంగా సెక్స్లోనే పాల్గొంటున్నారు.2008లో ఇలాంటి సర్వే చేపట్టినప్పుడు ఈ నిష్పత్తి 10:1 ఉంటే 2016కి 10:3 స్థాయికి పెరిగింది. వీళ్లంతా ఇలా తయారవడానికి అందులో బాటులో సెల్ ఫోన్స్, ఇంటర్నెట్ సౌలభ్యం ఉండటమేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల పట్ల బాధ్యత వహించాలి వాళ్ళ ప్రతీ కదలికను కనిపెట్టుకుంటూ ఉండాలి. ఇవన్నీ లేని పక్షంలో ఇలాంటివి ఎక్కువగా జరుగుతాయి.