మామూలుగా పూర్వ కాలంలో మంత్రాలకు చింతకాయలు రాలతయని ఒకప్పుడు ఉండేది కానీ ఇప్పుడు మాత్రం క్యాష్ కోసం క్లాస్ చేస్తూ కొందరు జనాలను బురిడీ కొట్టించి చాలా మంది బ్రతికేస్తూ వస్తున్నారు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడంలో భారత దేశం రెండోవ స్థానంలో ఉండటటం గమనార్హం.. అందుకే దొంగ బాబాలు కూడా పెరుగుతూ వస్తున్నారు...

 

ఇకపోతే పాపులర్ అవ్వాలంటే చిన్న రాయిని పెద్ద గా చూపించాలని చాలా మంది అనుకుంటారు. అందుకే ఆలయాలా కన్నా  ఎక్కువగా మిగితావి పెరిగిపోతున్నాయి.. సినిమాలు డబ్బులు కోసం చేస్తే ఇప్పుడు లైవ్ లో ఒక వస్తువు ఈ ఆకారంలో ఉంది.. అయితే ఇది యాదృచ్ఛికం అంటూ చాలా మంది అనుకుంటారు.. ఇకపోతే ఈ మధ్య మన దేశంలో ఈ మూఢ నమ్మకలా ప్రచారం జోరుగా సాగుతోంది.. 

 

అసలు విషయానికొస్తే.. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఎన్నో విషయాలు చెప్పారు.  చిత్ర విచిత్రాలు జరుగుతాయని చెప్పకనే చెప్పారు.  ఇలాంటి విచిత్రమైన సంఘటన ఒకటి రాజస్థాన్ లో జరిగింది.  రాజస్థాన్ లోని నిమోదియాలోని ఓ మేకకు మేక పిల్ల పుట్టింది.  ఆ మేకపిల్ల ముఖం అచ్చం మనిషి ముఖంలా ఉండటంతో దానిని దేవుని మేకలా భావించి పూజలు చేస్తున్నారు.  

 

అయితే..ముఖేష్ ప్రజాపాప్ అనే వ్యక్తికీ చెందిన ఈ మేక ఓ పిల్లకు జన్మను ఇచ్చింది.  మిగతా మేకల్లా ముఖం లేకుండా చూడటానికి మనిషి ముఖంలా ఉన్నది.  సైక్లోపియా సమస్య వలన ఇలాంటి మేక జన్మించినట్టు వైద్య నిపుణులు చెప్తున్నారు. ఇది కేవలం జంతువులకే పరిమితం కాదని, మనుషులకు కూడా వస్తుందని తెలిపారు... అయిన వినని ప్రజలు దేవుడు పుట్టాడు.. అంటూ పూజలు చేస్తున్నారు.. ఆ వింతను మీరు ఓ లుక్ వేయండి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: